Geeta Madhuri's son Barasala: టాలీవుడ్ లో సింగర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది గీతా మాధురి. నటుడు నందుతో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె, ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ అబ్బాయికి కుటుంబ సభ్యులు ఘనంగా బారసాల వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు సంగీత దర్శకులు, సినీ గాయకులు, నటీనటులు పాల్గొన్నారు. బాబును ఆశీర్వదించారు. ప్రస్తుతం గీతా మాధురి దంపతుల కొడుకు బారసాల వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


అట్టహాసంగా నందు దంపతుల కొడుకు బారసాల వేడుక


ఇక తన ముద్దుల అబ్బాయి పేరును నందు దంపతులు జాతకం ప్రకారం పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వారు సెలక్ట్ చేసిన పేరు టాలీవుడ్ స్టార్ హీరో పేరులా ఉండటంతో నెటిజన్లు పేరు బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. తమ అబ్బాయి పేరును ‘ధృవధీర్‌ తారక్‌’గా పెట్టినట్లు గీతా మాధురి తెలిపింది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు బాబును ఆశీర్వదించారు. ఇక నెటిజన్లు సైతం నందు దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒక పాప, ఒక బాబుతో కలిసి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ‘‘ఫిబ్రవరి 10న మాకు కొడుకు పుట్టాడు.. మా జీవితాల్లోకి ఆనందం తెచ్చాడు’’ నందు ఇప్పటికే తన సంతోషాన్ని పంచుకున్నాడు.   






2014లో నందు, గీతామాధురి పెళ్లి


గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2014లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ దంపతులకు సుమారు 5 సంవత్సరాల తర్వాత, అంటే 2019 అమ్మాయి పుట్టింది. ఆమెకు దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత బాబుకు జన్మనిచ్చింది.


ఇండస్ట్రీలో రాణిస్తున్న గీత, నందు


గీతా మాధురి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్‌గా రాణిస్తోంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గానూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు సినిమాల్లో పాడిన పాటలకు గాను బెస్ట్‌ సింగర్‌ గా అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. గత కొద్ది కాలంగా యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా కనిపిస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. నందు చివరిసారిగా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ అనే మూవీలో కనిపించాడు. మొత్తంగా భార్యాభర్తలు సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభ చాటుకుంటున్నారు.


Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు