'గుంటూరు టాకీస్', 'కృష్ణ అండ్ హిస్ లీల', 'మా వింత గాధ వినుమా' వంటి సినిమాలతో యంగ్ హీరోగా యూత్​లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ 'DJ టిల్లు' సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్​లోకి వచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో సిద్దుకి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. అగ్ర హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసే సినీ లవర్స్ కూడా సిద్దు మూవీస్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. 'డీజే టిల్లు' ఆడియన్స్​లో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ మూవీ సక్సెస్​తో సిద్దు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్​తో ఫుల్ బిజీ అయిపోతున్నాడు.


ఇప్పటికే 'DJ టిల్లు' సీక్వెల్​గా వస్తున్న 'టిల్లు స్క్వేర్'(Tillu Square) షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖ స్టైలిస్ట్ గా పేరు తెచ్చుకున్న నీరజ కోన సిద్దుతో తీయబోయే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఈమె మరెవరో కాదు ప్రముఖ రచయిత కోన వెంకట్ కి స్వయానా సోదరి. ఇండస్ట్రీలో స్టైలిస్ట్​గా పని చేసిన ఈమె ఇప్పుడు దర్శకురాలిగా మారబోతుంది.






నీరజ కోన వినిపించిన స్టోరీ లైన్ నచ్చడంతో సిద్దు ఆమెతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో రొమాంటిక్ జోనర్​లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. టాలీవుడ్​లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సమాచారం. తాజాగా పీపుల్స్ మీడియా సంస్థ తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోయే తదుపరి చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ని సోషల్ మీడియా వేదికగా అందించారు.


ఆ అప్డేట్ మరేదో కాదు సిద్దు జొన్నలగడ్డ - నీరజకోనా కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించినదని తెలు

స్తోంది. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ పోస్టర్ను విడుదల చేస్తూ. ' అక్టోబర్ 16న 10: 08గం. లకు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు' తెలిపారు. ఈ చిత్రంలో సిద్దు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.


Also Read : మెగా బ్లాక్ బస్టర్ 'శంకర్ దాదా MBBS' రీ రిలీజ్ - ఫ్యాన్స్ రెడీనా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial