SJ Suryah About Kushi 2 and Pawan Kalyan: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌లో యూత్‌లో యమ క్రేజ్‌ తెచ్చిపెట్టిన చిత్రం 'ఖుషీ' అనే చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు  ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌-భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ అప్పట్లో యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఇందులో పాటలు కూడా బాగా హిట్‌ అయ్యాయి. 2001లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఇదోక మైలు స్టోన్ చిత్రంగా నిలిచింది. అంతటి హిట్‌ మూవీకి సీక్వెల్‌ కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


షాకిచ్చిన డైరెక్టర్


అంతేకాదు ఖుషీ 2 పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తరచూ ఈ సినిమా డైరెక్టర్‌ ఖుషీ 2పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఆయన నోరు విప్పలేదు. కానీ తాజాగా ఆయన ఖుషీ 2 గురించి ఆసక్తికర విషయం చెప్పారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్య నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాని, హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌, ఎస్‌ జే సూర్యలు ముగ్గురితో ప్రత్యేక డిబెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక మరోసారి ఎస్‌జే సూర్యను ఖుషీ 2 ఎప్పుడు చేస్తున్నారని అడగ్గా.. ఆయన చెప్పిన సమాధానం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురి చేసింది.


స్క్రిప్ట్ బాగా ఎంజాయ్ చేశారు


"ఖుషీ 2 స్క్రిప్ట్‌ ఎప్పుడో అయిపోయింది. దానిని ప్రత్యేకంగా పవన్‌ సార్‌ కోసమే రాసుకున్నాను. ఇప్పటికే ఆయనకు స్క్రిప్ట్‌ కూడా వినిపించింది. కథ బాగా వచ్చింది. చాలా ఎంజాయ్‌ చేస్తూ రాశాను. పవన్‌ సర్‌ కూడా స్క్రిప్ట్‌ని బాగా ఎంజాయ్‌ చేశారు. కానీ, ఈ సినిమా చేయనన్నారు. "ప్రస్తుతం నేను లవ్‌ స్టోరీస్‌ చేసే మైండ్‌ సెట్‌లో లేనని, ఆ స్టేజ్‌ దాటేశాను. చేయను సూర్య అన్నారు" అని చెప్పారు. దీంతో అలాంటిది ఏం లేదు సర్‌. మీ లాంటి హీరోలు ఎప్పుడైనా ప్రేమకథలు తీయొచ్చు. ఇక్కడ ఎన్టీఆర్‌లు, తమిళంలో ఎంజీఆర్ లాంటి హీరోలు చాలా వయసు, గ్యాప్ తర్వాత కూడా సూపర్‌ లవ్‌స్టోరీలు చేశారు. మీరు చేయొచ్చు అంటే. లేదు చేయను అన్నారు.



కానీ, సినిమా ఆయన చేస్తే మాత్రం చలా సూపర్‌గా వచ్చేది" అని చెప్పుకొచ్చారు.  కాగా పవన్‌ కళ్యాణ్‌ని మళ్లీ 'ఖుషీ' సిద్దార్థ్‌ రాయ్‌గా చూడాలి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది గట్టి షాక్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎస్‌జే సూర్య కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కాకుండ ఖుషీ 2కి ఏ హీరో అయితే బాగుంటుంది అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. హీరో నాని, రామ్‌ చరణ్‌, దళపతి విజయ్‌ చేస్తే బాగుంటుంది. ఈ ముగ్గురు హీరోలకు ఖుషీ 2 కథ బాగా ఆప్ట్‌ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 



 Also Read: 'గేమ్ ఛేంజ‌ర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు