Game Changer Release Update By Producer Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కియరా అద్వానీ క‌లిసి న‌టిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజ‌ర్'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిజానికి రామ్ చ‌ర‌ణ్ అభిమానులు సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొద‌లై ఇప్ప‌టికే దాదాపు మూడేళ్లు అవుతోంది. ఒక్క పాట మిన‌హా ఎలాంటి అప్ డేట్ రాలేదు ఇప్ప‌టికీ. కాగా.. ఇంత‌లోనే మ‌రో వార్త వైర‌ల్ అయ్యింది. అదే.. రామ్ చ‌ర‌ణ్ సీన్లు రీ షూట్ అని రిలీజ్ వాయిదా ప‌డింద‌ని. దానిపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు.


2025లో రిలీజ్ అంటూ.. 


'గేమ్ ఛేంజ‌ర్' సినిమా ఈ ఏడాది డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది సినిమా టీమ్. ఈ మేర‌కు ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ షెడ్యూల్ కూడా పూర్తైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ మీద షూట్ చేసిన కొన్ని సీన్లు రీ షూట్ చేయాల‌ని, దాని వ‌ల్ల 2025లో సినిమా రిలీజ్ అవుతుంద‌నే వార్త‌లు పుట్టుకొచ్చాయి. గ‌త రెండు రోజులుగా ఈ వార్త స‌ర్క్యులేట్ అవుతుంది. 


క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. 


నేష‌న‌ల్ మీడియాలో మాట్లాడిన దిల్ రాజు ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. క్రిస్ మ‌స్ కానుక‌గా సినిమాని రిలీజ్ చేస్తాము అని ప్ర‌క‌టించారు. “షూట్ మొత్తం అయిపోయింది. ఈ సినిమాని క్రిస్ మ‌స్ కి రిలీజ్ చేస్తున్నాం. సినిమా క‌చ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ న‌మోదు చేస్తుంది. క‌చ్చితంగా రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ సార్ ఇమేజ్ ని ఎక్క‌డికో తీసుకెళ్తుంది ఈ సినిమా. ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది. క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంది” అని అన్నాడు దిల్ రాజు. 


2021లో మొద‌లైన షూట్.. 


'గేమ్ చేంజ‌ర్' సినిమా షూటింగ్ 2021లో మొద‌లైంది. అప్ప‌టి నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు ఈ సినిమాకి సంబంధించి. చాలా సార్లు ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ అవుతుంద‌ని ఫ్యాన్స్ ఊరించారు. కానీ అలాంటిది ఏమీ జ‌ర‌గ‌లేదు. అయితే, ఇటీవ‌ల జ‌ర‌గండి, జ‌రగండి అని ఒక లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేయ‌గా.. అది యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో త‌దుప‌రి అప్ డేట్స్ కోసం, సినిమా రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. 


ఇక ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అడ్వానీ, ఎస్ జే సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, జ‌య‌రామ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఆ సినిమా కి దిల్ రాజు ప్రొడ్యూసర్. ఆ సినిమాతో పాటు బుచ్చి బాబు డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేస్తున్నారు. అది పూర్తి కామెడీ జోన‌ర్ లో ఉంటుంద‌ని రామ్ చ‌ర‌ణ్ ఒక ఈవెంట్ లో చెప్పారు. ఆ సినిమాలో జాన్వీ క‌పూర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటుగా.. సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయ‌నున్నారు రామ్ చ‌ర‌ణ్. గేమ్ ఛ‌స్త్రంజ‌ర్ సినిమా ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌థ నేప‌థ్యంలో ఉండ‌గా.. బుచ్చి బాబు సినిమా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 


Also Read: ప్రతిదానికి డబ్బులు లెక్కలేసుకునే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి పెళ్లయితే.. నవ్విస్తున్న 'జనక అయితే గనక' ట్రైలర్‌