Srinu Vaitla Upadte on Venky 2:  డైరెక్టర్‌ శ్రీను వైట్ల, మాస్‌ మాహారాజా రవితేజ కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఇండస్ట్రీలో వీరిద్దరిది హింట్‌ కాంబినేషన్‌. రవితేజ,శ్రీనువైట్ల కలిశారంటే థియేటర్లో ఫ్యాన్స్‌ ఈళలు, నవ్వులు పక్కా. వీరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. అవన్ని కూడా మంచి విజయం సాధించింది. అందులో 'వెంకీ' మూవీ ఎవర్‌ గ్రీన్‌ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమాకు ఈ సినిమాకు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఇందులో రవితేజ హిలెరియస్‌ కామెడీ, పంచ్‌ డైలాగ్‌లు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా వెంకీ సినిమాను థియేటర్లో రీరిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.


రీరిలీజ్‌లోనూ ఈ మూవీ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. థియేటర్లు ఆడియన్స్‌ ఈళలతో మారుమోగాయి. మూవీ వచ్చి 20 ఏళ్లు అయినా ఇప్పటికే అదే క్రేజ్‌ అందుకుంది. ఆడియన్స్‌ నుంచి అయితే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక వెంకీ మూవీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా  ఈ మూవీ డైరెక్టర్‌ శ్రీను వైట్ల తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన మూవీ జర్నీతో పాటు వెంకీ సినిమా విశేషాలను పంచుకున్నారు. రీరిలీజ్‌లో కూడా వెంకీ సినిమాకు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. చాలా థియేటర్‌లో విడుదలై ట్రెమండస్‌ రెస్పాన్స్‌ అందుకుంది. ఇది చూసి నేను సర్‌ప్రైజ్‌ అయ్యాను. అదీ కూడా వరల్డ్‌ వైడ్‌గా కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.


Also Read: Ram Charan Birthday: రామ్‌ చరణ్‌ బర్త్‌డే - అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ స్పెషల్‌ విషెస్‌, అరుదైన వీడియో షేర్‌ చేసిన బన్నీ


ఇది చూసి అంతా 'వెంకీ 2' అంటున్నారు. అప్పుడే నేను పార్ట్‌ 2 గురించి ఆలోచించాను. రైటర్స్‌తో కూడా మాట్లాడాను. వారితో కలిసి చర్చించాను కూడా. కొన్ని స్టోరిస్‌ చెప్పారు. ఒక కథ అనుకుని దానికి ఒక షేప్‌ వచ్చాక వెంకీ 2 గురించి క్లారిటీ వస్తుంది. కానీ వెంకీ 2 తీయాలని మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ఇది చూసి వెంకీ ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. వెంకీ 2 వస్తే మాత్రం మాస్‌ మాహారాజా ఫ్యాన్స్‌కి మాత్రం ఇది పండగే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల మాట్లాడుతూ.. వెంకీ సినిమాని అనుకున్నప్పుడే ఫస్ట్‌ నుంచి లాస్ట్‌ వరకు హెలెరియస్‌ ఫన్‌తో నవ్వించాలనుకున్నాను. అందుకే వెంకీకి రవితేజను అనుకున్నాను. సాధారణంగా మేమిద్దరం కలిశాం అంటేనే కామెడీ పక్కా అనుకుంటారు. అలాగే వెంకీతో అందరి అంచనాలను రీచ్‌ అవ్వాలనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 


అసిన్ బిజీ ఉండటంతో స్నేహకు చాన్స్


ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన నటి స్నేహ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రావణి పాత్రలో ఆమె చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ ఈ మూవీ అనుకున్నప్పుడు శ్రీనువైట్ల మొదట స్నేహను అనుకోలేదట. ఈ సినిమాలో హీరోయిన్ గా అసిన్ అనుకున్నారట. ఇదే ప్రపోజల్‌ ఆమె ముందు పెట్టాడట శ్రీనువైట్ల. అయితే అప్పటికే ఆమె ఇతర సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉందట. కాల్షిట్‌ లేకపోవడంతో చివరికి హీరోయిన్‌గా స్నేహను తీసుకున్నట్టు ఆయన తెలిపారు.