సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓ చిన్న సినిమాగా విడుదలైన 'బేబీ' ఏకంగా ఇప్పటి వరకు రూ.75 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. కలెక్షన్స్ తో పాటు ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా జూలై 20న మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేష్ మెగాస్టార్ అంటే తనకు ఎంత ఇష్టమో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.


ఇక ఈ ఈవెంట్లో సాయి రాజేష్ మాట్లాడుతూ.."ఒక చిరంజీవి ఫ్యాన్‌కి ఉండే అదృష్టాలు మీకు ఉండవు అన్నయ్య. మేము ఎలా ఉంటాం.. ఏం చేస్తాం.. అనేది మీరు చూడలేరు. మేము ఏదైనా డిప్రెషన్ లో ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ లో ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట.. మీరే మా పారాసెటమల్, మీరే మా మ్యాన్షన్ హౌజ్, మీరే మా సింగిల్ మార్ట్.. అన్ని మీరే.. అమెరికాలోని డల్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా.. రోజంతా ఎంతో కష్టపడే ఆటోవాలా అయినా.. ఎవరైనా అందరూ చిరంజీవి అభిమానులే. చిరంజీవి అభిమానులు అంతటా ఉంటారు. నేను దర్శకుడిని అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పడగానే చిరంజీవి ఫోటో ఉండాలని అనుకున్నాను. అలా నేను చేసిన నాలుగు సినిమాల్లో మీ ఫోటో ఉంటుంది. నేను నాస్తికుడిని అన్నయ్య. మీ ఫోటో పడిన తర్వాతే నా సినిమా స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్షల మందికి దేవుడు అన్నయ్య మీరు. మా జీవితాల్లో ఉన్నందుకు మీకు చాలా థాంక్స్. సాయి రాజేష్ అంటే చిరంజీవి అభిమానుల్లో చిరంజీవి లాంటోడు. నేను అలాగే ఫీల్ అవుతా. ప్రతి ఫ్యాన్ ఇలానే ఫీల్ అవుతాడు" అని సాయి రాజేష్ చెప్పారు.


"మీ ఎదురుగా కూర్చుని ఆరోజు మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు అసలు మీరు ఏం మాట్లాడారో సగం వినను కూడా వినలేదు. ఎందుకంటే అప్పుడు నా జీవితం మొత్తం కనిపించింది. సినిమా డైలాగ్ అనుకుంటారేమో కానీ.. మీరు అడగండి అన్నయ్య.. ప్రాణం ఇచ్చేస్తామ్" అంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సాయి రాజేష్. దీంతో మెగాస్టార్ పై సాయి రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఈవెంట్ కంటే ముందు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కే ఎన్ మెగాస్టార్ ని కలిశారు. సుమారు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు ఆ తర్వాత 'బేబీ' సినిమా చాలా బాగుందని చిరంజీవి మూవీ టీం ని ప్రత్యేకంగా అభినందించారు.


ఇక బేబీ విషయానికి వస్తే.. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ ఈ సినిమాని నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. MN బాల్ రెడ్డి కెమెరా మెన్ గా వ్యవహరించిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీ రోల్ ప్లే చేయగా.. మెగాబ్రదర్ నాగబాబు, సీత, కుసుమ వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషించారు.


Also Read : బాలీవుడ్ తండ్రీ కొడుకులతో అక్రమ సంబంధం - ఆ సినీ క్రిటిక్‌పై మహిళా కమిషన్‌కు సెలీనా ఫిర్యాదు



Join Us on Telegram: https://t.me/abpdesamofficial