Chiranjeevi Reaction On Pawan Kalyan Ustaad Bhagat Singh Trailer : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్‌ అదిరిందంటూ పోస్ట్ చేశారు.

'ఉస్తాద్‌తో అన్నీ శుభాలే'

'మ్యాజిక్ జరిగింది... ముహూర్తం కుదిరింది... ట్రైలర్ అదిరింది. ఈ ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అన్నీ శుభాలే' అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. 'వింటేజ్ పవర్ స్టార్ మాస్ వైబ్స్ మళ్లీ కనిపిస్తున్నాయి. కల్యాణ్ బాబాయ్ మేనరిజమ్స్, స్టైల్ వేరే లెవల్. హరీశ్ శంకర్ బ్రో ఇచ్చిపడేశావ్. మార్చి 19న బిగ్ స్క్రీన్‌పై ఈ మాస్ జాతర చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ రాసుకొచ్చారు.

వీరితో పాటే డైరెక్టర్స్ బుచ్చిబాబు, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. పవర్ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ ఓజీ డైరెక్టర్ సుజీత్ తెలిపారు.

Also Read : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన 

పవర్ ఫుల్ డైలాగ్స్

ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రియల్ పవనిజాన్ని ఎలివేట్ చేసేలా భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్... ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం' అంటూ పవన్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలుస్తోంది. పవన్ స్టైలిష్, వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి ఉన్నాయి. దీంతో ట్రైలర్ డైలాగ్స్, లుక్స్‌ను పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

పవన్ స్పీచ్‌పై...

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. భారీగా వచ్చే ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ సహా ఇతర నటీనటులు ఈవెంట్‌కు హాజరు కానున్నారు. పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్దిబన్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటే రావు రమేశ్, ప్రభాస్ శీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.