Chiranjeevi preparation for Vishwambhara in GYM : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక ఇప్పుడు 'విశ్వంభర' సెట్స్ లో అడుగుపెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా కోసం భారీ కసరత్తులు మొదలుపెట్టారు.


'విశ్వంభర' కోసం చిరంజీవి భారీ కసరత్తులు


'విశ్వంభర' సినిమా కోసం మెగాస్టార్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వర్కౌట్ వీడియోని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏజ్ లో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో చివర్లో చిరంజీవి 'గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అంటూ ఫుల్ జోష్ లో చెప్పారు. ప్రస్తుతం మెగాస్టార్ వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


హైదరాబాద్ లో భారీ సెట్






'విశ్వంభర' మూవీ కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ఉండబోతోంది. ఈ షెడ్యూల్ లోనే మెగాస్టార్ పాల్గొన్నారు. ఇందుకోసం హైదరాబాదులో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఓ భారీ సెట్ వేసినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.


'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్


కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఇందులో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. ఇప్పుడు శింబు కూడా 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే శింబు ఇందులో మెయిన్ విలన్ గా చేస్తున్నారా? లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


'విశ్వంభర' కాస్ట్ అండ్ క్రూ


మెగాస్టార్ కెరియర్ లో 156వ సినిమాగా ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.


Also Read : ఫస్ట్ టైమ్ ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ - అంతా ‘హనుమాన్’ మహిమే!