Baahubali The Epic Re Release Collections: భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఫస్ట్ మూవీ ఏది? అంటే మనకు గుర్తొచ్చే పేరు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి'. 2015లో పార్ట్ 1 రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.600 నుంచి రూ.650 కోట్ల వసూళ్లు సాధిస్తే... 2017లో పార్ట్ 2 వరల్డ్ వైడ్‌గా రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా 'బాహుబలి: ది ఎపిక్'గా ఈ నెల 31న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Continues below advertisement

ఏడేళ్ల క్రితమే చెప్పారు

అయితే, 'బాహుబలి: ది ఎపిక్' రిలీజ్ ఆలోచన ఏడేళ్ల క్రితమే ఓ బిజినెస్ మ్యాన్‌కు వచ్చింది. అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ తాజాగా వైరల్ అవుతోంది. తన విజన్‌తో పారిశ్రామిక రంగంలో ఎన్నో విజయాలు సాధించిన లాయిడ్ గ్రూప్స్ అధినేత, ధనిక భారత విజన్ సృష్టికర్త విక్రం నారాయణరావు ఏడేళ్ల క్రితమే దర్శకధీరుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'బాహుబలి: ది కంక్లూజన్' (ఏప్రిల్ 28, 2017) రిలీజ్ అయిన వారం రోజులకు నారాయణరావు ఓ ట్వీట్ చేశారు.

Continues below advertisement

రూ.500 కోట్ల కలెక్షన్స్

దర్శకధీరుడు రాజమౌళిని ట్యాగ్ చేసిన బిజినెస్ మ్యాన్ నారాయణరావు... 'రాజమౌళి గారు.. బాహుబలి పార్ట్ 1, 2 రెండింటినీ కలిపి ఎడిట్ చేసి ఓ సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటివరకూ ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో తక్కువలో తక్కువ రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు.' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా... ఓ విజన్ ఉన్న వ్యాపారవేత్తకు ఈ ఆలోచన ఏడేళ్ల క్రితమే వచ్చిందని... ఆయన అభిప్రాయం ఇప్పుడు నిజం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వ్యాపార రంగంలోనే కాదని... చిత్ర పరిశ్రమ రంగంలోనూ ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా ఈ ట్వీట్ షేర్ చేస్తూ... 'తథాస్తు... 2017లో ఓ అభిమాని పోస్ట్ చేసిన కోరిక అక్టోబర్ 31న నెరవేరుతుంది.' అంటూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

Also Read: క్రిస్మస్ బరిలో ఆది సాయికుమార్ 'శంబాల' - విశ్వక్ సేన్, రోషన్ మూవీస్‌తో పాటే... బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ సందడి?

'బాహుబలి: ది ఎపిక్' రన్ టైం 3 గంటల 44 నిమిషాలుగా లాక్ చేశారు రాజమౌళి. రెండు పార్టులో కొన్ని సీన్స్, సాంగ్స్ రిమూవ్ చేసి ఫైనల్ రన్ టైం ఫిక్స్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ సైతం రిలీజ్ చేయగా వేరే లెవల్‌లో ఉంది. ఈ నెల 31న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈవెంట్ కూడా జరగనుండగా... దాదాపు పదేళ్ల తర్వాత ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి ఒకే వేదికగా కనిపించనున్నారు.