Bhaagamathie 2 : సౌత్ సీనియర్ హీరోయిన్ టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి నేడు తన 42 పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు అనుష్కకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ను అందజేస్తున్నారు. మరోవైపు అనుష్క కొత్త సినిమాలకు సంబంధించి మేకర్స్ అప్డేట్స్ సైతం అందిస్తున్నారు. 'నిశ్శబ్దం' తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న అనుష్క రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Miss Shetty Mr. Polishetty) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ మూవీ విజయం సాధించడంతో అనుష్క ఇప్పుడు వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.


ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న సోషియో ఫాంటసీ మూవీలో అనుష్క హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు చిరంజీవి పక్కన అనుష్క మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని, త్వరలోనే మేకర్స్ దీనిపై పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా టాక్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం అనుష్క మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసి మరో కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కెరియర్ లో 49 సినిమాలు చేసిన అనుష్క తన 50వ సినిమాని ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది.


ఈ క్రమంలోనే తన 50 మూవీ మెగాస్టార్ తో ఉండబోతుందని అంతా అనుకున్నారు. కానీ అనుష్క మాత్రం చిరుని రిజెక్ట్ చేసి తన 50వ సినిమాగా భాగమతి సీక్వెల్ ని ప్రకటించడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన 'భాగమతి' 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 'బాహుబలి' తర్వాత అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ అనుష్కకు చాలా స్పెషల్. అందుకే తన 50వ సినిమాగా 'భాగమతి' కి సీక్వెల్ చేసేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భాగమతికి సీక్వెల్ రావడం మంచి విషయమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల కంటే కమర్షియల్ సినిమాలే చాలా అవసరం.


ఎందుకంటే స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీలో మళ్ళీ తన క్రేజ్ ని పెంచుకోవాలంటే కమర్షియల్ సినిమాలు చేయడం బెస్ట్ ఆప్షన్. అలాంటి అవకాశం మెగాస్టార్ మూవీతో అనుష్కకు వచ్చినట్లు తెలిసింది. కానీ స్వీటీ ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా 'భాగమతి' సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించనున్నారు.


Also Read : అరుంధతిగా భయపెట్టి, భాగమతిగా బాక్సాఫీస్​ను షేక్ చేసిన మిస్ శెట్టి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial