తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘జైలర్’ నిలిచింది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ సినిమా అనుకున్న దానికంటే అద్భుత విజయాన్ని అందుకోవడంతో నిర్మాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ‘జైలర్’ సక్సెస్ లో భాగస్వాములైన వారికి అదిరిపోయే బహుమతులను ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.  


‘జైలర్’ మ్యూజిక్ డైరెక్టర్ కు లగ్జరీ కారు గిఫ్టు


తాజాగా ‘జైలర్’ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ ను కళానిధి మారన్ సర్ ప్రైజ్ చేశారు. విలువైన పోర్షే కారుతో పాటు చెక్ ను అందజేశారు. ఈ చెక్ ద్వారా ఆయనకు రూ. 1 కోటి రూపాయలు అందజేసినట్లు తెలుస్తోంది. స్వయంగా కళానిధి మారన్ అనిరుధ్ ఇంటికి వెళ్లి కారును బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ వేదికగా ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. కళానిధి గిఫ్ట్ పట్ల అనిరుధ్ సంతోషం వ్యక్తం చేశారట.     ‘జైలర్’ మూవీ విజయంలో అనిరుధ్ అందించిన మ్యూజిక్ సైతం కీలక పాత్ర పోషించింది. హుకుమ్ తలైవర్ అలప్పారా, కావాలయ్యా సాంగ్స్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేలా చేశాడు. ప్రస్తుతం అనిరుధ్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సంగీత దర్శకులలో అనిరుధ్ ఒకరు. అంతేకాదు, అనిరుధ్ రజనీకాంత్ భార లతకు స్వయంగా మేనల్లుడు కావడం విశేషం.  










రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కు ఖరీదైన బహుమతులు


అటు ఇప్పటికే ‘జైలర్’ హీరో రజనీకాంత్ కు కళానిధి మారన్ రూ.1.24 కోట్ల విలువైన లగర్జీ BMW కారును బహుమతిగా అందించారు. కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు.  డైరెక్టర్ నెల్సన్‌కు కూడా లేటెస్ట్ లగ్జరీ పోర్చే కారును బహుమతిగా అందించారు. ఈ కారు ఖరీర్ కూడా రూ. కోటికి పైనే ఉంటుదని తెలుస్తోంది. ఫ్యాన్సీ అమౌంట్ తో కూడిన చెక్  ను కూడా అందించారు. కళానిధి మారన్ స్వయంగా కలిసి ఈ కార్లను, చెక్స్ ని అందచేశారు. దీనికి సంబంధించిన దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు మరికొంత మంది చిత్రబృందానికి కూడా కళానిధి మారన్ బహుమతులు అందించినట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్ 7నుంచి ‘జైలర్’ ఓటీటీ స్ట్రీమింగ్


ఇక అద్భుత విజయాన్ని అందుకున్న ‘జైలర్’ మవీ సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు.


Read Also: మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోడీ - సుశ్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత ఎవరితో డేటింగ్ చేస్తున్నారో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial