anchor vindhya vishaka Shocking Comment on Tollywood Anchors:  ఐపీఎల్‌ యాంకర్‌ వింధ్య విశాఖ (Anchor Vindhya Vishaka)సహా యాంకర్లపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. సీనియర్‌ యాంకర్స సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి వారిని కూడా వదలకుండ వింధ్య ఇలా కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం స్పోర్ట్స్‌ యాంకర్‌గా రాణిస్తున్న వింధ్య ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీలోని యాంకర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కొందరు యంకర్స్‌ ఉన్నారని, తెలుగు రాకపోయిన యాంకరింగ్‌ చేస్తూ భాషను భ్రష్టు పట్టిస్తున్నారంటూ సంచలన కామెంట్స్‌.


సుమక్కను మాకూ షోలు వదిలేయండి అని అడుగుతుంటా..


Anchor Vindhya About Anchors Suma, Udhayabhanu, Jansi: అసలు యాంకరింగ్‌ అనే పదానికి అర్థం మార్చేస్తున్నారని, డబుల్‌ మీనింగ్‌ కామెడీ, బూతు పదాలను ఆడియన్స్‌కి అలవాటు చేస్తున్నారంటూ వింధ్య షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత యాంకర్లో సుమక్క అంటే చాలా ఇష్టమని చెప్పింది. "ఏదైనా ఈవెంట్స్‌లో యాంకర్‌ సుమను కలిసి సరదాగా తనన ఆటపట్టిస్తుంటాను. మాకు కూడా కొన్ని షోలు వదిలేయచ్చు కదా సుమక్క అంటూ సరదాగా అంటుంటాను. ఏదో అలా అంటాం కానీ, తనలా మేం అసలు చేయగలమా అనిపిస్తుంది. అసలావిడ స్పాంటనియస్‌గా ఎలా ఇలా మాట్లాడగలుగుతాను. ఆవిడకు ఆ డైలాగ్స్‌ ఎలా వస్తుంటాయని అనిపిస్తుంది. ఏదో సరదగా అన్న కూడా తనలా మాత్రం యాంకర్ చేసేవారు ఎవరు లేరని చెప్పాలి. తన సోస్, సుమక్క యాంకరింగ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాను" అని చెప్పింది. 


ఆ యాంకర్లు తెలుగును భ్రష్టు పట్టిస్తున్నారు


అలాగే యాంకర్‌ ఉదయభాను గురించి మాట్లాడుతూ.. "ఆమె ఎప్పటి నుంచో యాంకర్‌గా రాణిస్తున్నారు. ఇప్పటికే అదే లుక్‌, గ్లామర్‌ని మెయింటైన్‌ చేస్తున్నారు. నిజంగా అది ఎవరికి సాధ్యం కాదు. షోలో ఉదయ భాను గారిని చూస్తుంటే అలాగే చూడాలి అనిపిస్తుంది" అని పేర్కొంది. ఇక యాంకర్‌ ఝాన్సీ గురించి మాట్లాడుతూ.. ఝాన్సీ గారికి సమాజం పట్ల చాలా నాలెడ్జ్ చాలా ఉంది. అన్ని విషయాల్లో తనకు అవగాహన ఉంది. తనతో కాసేపు మాట్లాడితే చాలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు" అంటూ వింధ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్నారు. కొందరు యాంకర్లను ఉద్దేశించి చేసిన ఆమె కామెంట్స్‌ చూస్తుంటే అది జబర్దస్త్‌ షో, ఆ యాంకర్ల గురించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆమె యాంకర్‌ రష్మి, వర్షిణీలను ఉద్దేశించే ఈ కామెంట్స్‌ చేశారా? అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదేమైన వింధ్య చెప్పినదాంట్లో చాలా నిజం ఉందంటూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు. 


Also Read: అమ్మాయిలను చంపే సైకో కిల్లర్‌కు ట్రాకర్ పెడితే? ఈ మూవీలో హీరోనే ఎక్కువ భయపెడతాడు