Anasuya Plays Mother to This Hero: సినీ నటి, సోషల్‌ మీడియా సెన్సేషన్ అనసూయ క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్‌గానే స్టార్‌ హీరోయిన్ల క్రేజ్‌ను, ఫేంను సంపాదించుకుంది. వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి అనసూయ హాట్‌టాపిక్‌ అవుతుంది. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా.. చివరికి ఏ పోస్ట్‌ చేసినా అది సెన్సేషన్ అన్నట్టుగా అయిపోయింది. ఇక యాంకరింగ్‌కు గుడ్‌ బై చెప్పి నటిగా ఫుల్‌ బిజీ అయిపోయింది. పాత్రు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ జాగ్రత్తగా కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటుంది. ఇద్దరు పిల్లల తల్లయిన గ్లామర్‌లో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. 


యంగ్ హీరోకు తల్లిగా..


స్టార్‌ హీరో సినిమా అయినా అందులో అనసూయ పాత్రకే ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. అంతగా క్రేజ్‌ సొంతం చేసుకుంది అనసూయ. దీనికి 'రంగస్థలం'లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర స్పెషల్‌ ఎక్సాంపుల్‌. పాత్ర ప్రాధాన్యత ఉంటే వేశ్యగా నటించేందుకు కూడా ఆమె వెనకాడటం లేదు. విలన్‌గా విలక్షణం చూపిస్తుంది. అలాంటి అనసూయ తాజాగా తల్లి పాత్రకు రెడీ అయ్యిందట. అదీ కూడా ఓ యంగ్‌ హీరోకి అని టాక్. నెక్ట్స్ రాబోయే టాలీవుడ్ క్రేజీ సినిమాలో అనసూయ తల్లి పాత్రలో ఎమోషన్‌ పండించనుందట. ఆ హీరో మరెవరో కాదు. డిజే టిల్లు సినిమాతో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో సిద్ధూ జోన్నల గడ్డకు అనసూయ తల్లిగా నటిస్తుందట. అయితే అది హీరో చిన్నప్పటి పాత్రకు అని సమాచారం. ఇది తల్లి సెంటిమెంట్‌ను బేస్‌ చేసుకుని సాగే కథ అని, ఇందులో ఫుల్‌ టూ ఫుల మదర్‌ సెంటిమెంట్‌ను పండించనుందట. అమ్మ గొప్పతనం గురించి వర్ణించే సినిమా కాబట్టి ఈ గ్లామరస్‌ యాంకర్‌ ఒకే చెప్పిందట. 


Also Read: పూనమ్‌ పాండే చనిపోలేదా? - ఇదంతా పబ్లిసిటీ స్టంటా! నటి మృతిపై నెటిజన్ల రియాక్షన్‌


ఆమె నిర్ణయంపై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం అనసూయ పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉంది. దీనితో పాటు మరిన్ని తెలుగు సినిమాలు, ఓ మలయాళ సినిమా కూడా చేస్తుందని టాక్‌. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ నటిగా ఫుల్‌ బిజీ అయ్యిన అనసూయ మరోవైపు ఫ్యామిలీకి సైతం సమయం కేటాయిస్తుంది. విరామం దొరికనప్పుడల్లా భర్త, ఇద్దరు కుమారులతో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుంటుంది. అటూ పర్సనల్‌ లైఫ్‌, ఇటూ ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. మరోవైపు ‌సోషల్‌ మీడియాలో బాగా సందడి చేస్తుంది. ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళుతూ ఫొటోలు షేర్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె డ్రెస్సింగ్‌పై దారుణమైన ట్రోల్స్‌ ఎదుర్కొంటుంది. అయినా అనసూయ తనకు ఏం పట్టనంటూ మరింత గ్లామరస్‌ డోస్‌ పెంచుతూ ఫొటోలు షేర్‌ చేస్తూ ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇస్తుంది. అలా ఎప్పుడు సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది ఈ గ్లామరస్‌ బ్యూటీ.