మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అదిరిపోయే డ్యాన్సులు, అంతకు మించిన ఫైట్లతో ఆకట్టుకున్నారు. తన మార్క్ నటనతో సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, నేటితో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 వసంతాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. “సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అందిరి ప్రేమ, ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నాను. నా ఎదుగుదలకు తోడ్పడుతున్న ఇండస్ట్రీ మిత్రులకు, ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆడియెన్స్ ప్రేమే కారణం” అని తెలిపారు.






బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ


బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో  చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’ చిత్రంలోనూ నటించారు. చిరంజీవి ‘డాడీ’లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ‘ఆర్య’ సినిమాతో మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు కేరళలోనూ చాలా చోట్ల 100 రోజులు ఆడింది. ‘దేశముదురు’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అదిరిపోయే నటన కనబర్చారు. 20 ఏండ్లలో 20 సినిమాలు మాత్రమే చేశారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున ఆయన నటించారు.  


పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్న బన్నీ


ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా వెలుగొందుతున్నారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో ఏకంగా రూ. 100 కోట్ల షేర్ సాధించి వారెవ్వా అనిపించింది.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘పుష్ప’ సినిమా మంచి విజయం సాధించడంతో ‘పుష్ప2’ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.   


ఇక అల్లు అర్జున్ సినిమాలతో బాగా బిజీగా ఉన్నా, కుటుంబతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కూతురు అర్హ, భార్య స్నేహతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంటారు. బిడ్డతో కలిసి చేసే అల్లరి నిత్యం అభిమానులతో పంచుకుంటారు.


Read Also: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!