ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు కోపం వచ్చింది. బ్యానర్లతో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్ల మీద ధర్నా తరహాలో అభిమానులు అంతా ఏకం కావడమే కాదు... సోషల్ మీడియా వేదికగా కూడా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అభిమాన కథానాయకుడు నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie) చిత్ర బృందంపై మండి పడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అని వివరాల్లోకి వెళితే... 


'పుష్ప 2' టీమ్... మేలుకోండి!
అప్డేట్... ఒక్క అప్డేట్... 'పుష్ప 2' నుంచి ఒక్క అప్డేట్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆ అప్డేట్ కోసమే 'పుష్ప 2' టీమ్ మీద ట్విట్టర్ వేదికగా ఎటాక్ చేస్తున్నారు. ఇప్పుడు 'వేకప్ టీమ్ పుష్ప' హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవల్ లో ట్రెండ్ అవుతోంది. 'పుష్ప 2' అప్డేట్ ఇవ్వడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇతర యూనిట్ సభ్యులపై ఆగ్రహాన్ని ఈ విధంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు 55 వేలకు పైగా #WakeUpTeamPushpa ట్వీట్స్ పడ్డాయి. 


ట్విట్టర్ ట్రెండ్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో 'మాకు పుష్ప అప్డేట్ కావాలి' (We Want Pushpa 2 Update) అంటూ బ్యానర్లు పట్టుకుని, స్లోగన్స్ వినిపిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, అనంతపురం, ఆసిఫాబాద్, కాకినాడతో పాటు కేరళలోని త్రిసూర్, ఒడిశాలోని గోపాలపూర్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అభిమానులు బ్యానర్లతో నిరసన తెలిపారు.


Also Read 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!


ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజుకు అయినా...
ఆగస్టు 8న మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బర్త్ డే. 'పుష్ప'లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. విలనిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 'పుష్ప 2' సినిమాలోనూ ఆయన పాత్ర కీలకమైనది. కనీసం ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు నాడు అయినా సరే ఒక అప్డేట్ ఇవ్వమని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే... మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. 


అప్డేట్ ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ఒకరు... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని మరొకరు... నువ్వు మగాడివి అయితే అప్డేట్ ఇవ్వమని ఇంకొకరు... సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు చేస్తున్న పోస్టులు శృతి మించి ఉంటున్నాయి. మాస్ వార్నింగ్స్ ఇస్తున్నారు.


Also Read మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?




'పుష్ప' విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. డిసెంబర్ 17, 2021లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా రోజుల సమయం తీసుకున్నారు. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత కూడా శరవేగంగా ఏమీ జరగడం లేదు. ఇప్పటికి 50 శాతం కూడా పూర్తి కాలేదని ఇండస్ట్రీ గుసగుస. దాంతో అభిమానుల కోపం కట్టలు తెంచుకుంటోంది. కొందరు అయితే సుకుమార్ దర్శకత్వం మీద నమ్మకం ఉంచమని ట్వీట్స్ చేస్తున్నారు. అదీ సంగతి!


గమనిక : సోషల్ మీడియాలో నెటిజనులు చేసిన పోస్టులకు ఏబీపీ దేశం ఎటువంటి బాధ్యత వహించదు. కొంత మంది చేసిన ట్వీట్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాం.