Ajith Kumar admitted to a hospital : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సంపాదించుకున్నాడు ఈ హీరో. తమిళంలోనే కాదు తెలుగులో అజిత్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక్కడి స్టార్ హీరోలకు సమానంగా ఆయనకు మార్కెట్ ఉంది. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అజిత్ ఉన్నట్టుండి హాస్పిటల్లో చేరడం అభిమానుల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుంది. ఇంతకీ అజిత్ హాస్పిటల్ లో ఎందుకు చేరారు? ఆయనకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళ్తే..


చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన అజిత్


తమిళ అగ్ర హీరో అజిత్ తాజాగా హాస్పిటల్ లో చేరారు. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలోనే అజిత్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి అజిత్ హాస్పిటల్ లో చేరారనే వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ హెల్త్ కు సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.  


రొటీన్ చెకప్ కోసమే


అజిత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అసలు విషయం బయటపడింది. అదేంటంటే, అజిత్ కు ఏమీ కాలేదని.. కేవలం రొటీన్ చెకప్ కోసమే అజిత్ అపోలో ఆసుపత్రికి వెళ్లాడని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం అజిత్ హెల్త్ చెకప్ కు సంబంధించి కొన్ని టెస్టులు చేయించుకుంటున్నారని, అందుకోసమే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, టెస్టుల అనంతరం ఒకటి రెండు రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని అంటున్నారు. ఈ విషయం బయటికి రావడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ విషయంపై అజిత్ ఫ్యామిలీ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అయితే అజిత్ రొటీన్ చెకప్ కోసమే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారనే విషయం బయటకు వచ్చినా కూడా ఆయన ఆరోగ్యం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.


చివరి దశలో అజిత్ కొత్త సినిమా షూటింగ్


అజిత్ చివరగా 'తునివు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం 'విధా ముయార్చి' అనే సినిమాలో నటిస్తున్నాడు. అజిత్ కెరీర్ లో 62వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మిజిల్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష, రెజీనా, ఆరవ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మొదలైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read : విడాకులైన సమంతను ఫాలో అవుతున్న చైతన్య - తెలుసుగా, మేం మారం బాస్‌..