Revathy Resigned From Association Of Malayalam Movie Artists (AMMA) : మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA)లో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈసారి ఏకంగా ఇద్దరు నటీమణులు ఉమ్మడిగా తమ రాజీనామాలు సమర్పించారు. దిగ్గజ నటి, డైరెక్టర్ రేవతితో పాటు, మరో నటి పద్మప్రియ (పద్మప్రియ జానకీ రామన్) తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకేసారి ఇద్దరు మాలీవుడ్కు చెందిన తారలు రిజైన్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
అదే రీజన్
తమ రాజీనామాల నిర్ణయం తొందరపాటుతో తీసుకున్న డిసిషన్ కాదని ఇద్దరూ ఇన్స్టా గ్రామ్లో ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశారు. 'ఈ నిర్ణయం ఏదో ఒక సంఘటన వల్ల తొందరపాటుతో తీసుకున్నది కాదు. పరిశ్రమలో మార్పు కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ ఆలోచన తర్వాతే సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాం. సురక్షితమైన పని వాతావరణం, ఆత్మగౌరవం, జవాబుదారీతనం, సమానత్వం లాంటి కనీసం హక్కుల కోసం మేము దశాబ్ద కాలంగా పోరాడుతున్నాం.
వీటి గురించి ప్రశ్నించినా మాకు మౌనమే సమాధానం వచ్చింది. మమ్మల్ని దూరం పెట్టారు. ఎప్పటికైనా పరిస్థితి మారుతుందని ఆశించాం. అందుకే ఓ చిన్న ఆశతో సంస్థలో కొనసాగాం. అది కూడా లేకుండా పోయింది.' అంటూ పోస్ట్ చేశారు.
రీసెంట్గా మలయాళ ఇండస్ట్రీని కుదిపేసిన హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కూడా రేవతి, పద్మప్రియ సంచలన కామెంట్స్ చేశారు. ఆ రిపోర్ట్ తర్వాత సంఘంలోని కొందరు వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేశారని... అది కేవలం జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికేనని అన్నారు. అంతే తప్ప నైతిక విలువలతో తీసుకున్న చర్య కాదని విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు, మీడియా దృష్టిని మరల్చిన తర్వాత... మళ్లీ పాత పద్ధతులే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.
అధికారం కాపాడుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారని... అసమానతలకు తావిచ్చే వ్యవస్థలు మాత్రమే అలానే ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇండస్ట్రీలో తమ జర్నీ కంటిన్యూ చేస్తామని... కొలీగ్స్ కోసం, సమానత్వంతో కూడిన పరిశ్రమ కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Also Read : Con City OTT : ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ - IMDbలో 9.1 రేటింగ్... తెలుగులోనూ స్ట్రీమింగ్
