కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటించిన సినిమా ఆచార్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 29వ తేదీ) విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆచార్య సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది.


ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక్కో టికెట్‌పై  మల్టీప్లెక్స్‌లో రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 పెంచుకోవచ్చు. దీంతోపాటు ఐదో షో ప్రదర్శనకు కూడా వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.


జీవో ఇచ్చిన కాసేపటికే బుక్‌మై షోలో ఈ సినిమా టికెట్లు కూడా ఓపెన్ చేశారు. తెలంగాణలో అనుమతులు దొరకగా... ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా రేట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా విడుదలకు ఇంకా మూడ్రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి త్వరలోనే ఏపీలో కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.