థియేటర్లలో ఇయర్ ఎండ్ ధమాకా గట్టిగా ఉండబోతోంది. డిసెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. యాక్షన్ ఫిల్మ్ 'సలార్'తో డిసెంబర్ 22న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రభాస్. ఆ సినిమా కంటే వారం ముందు 'కెప్టెన్ మిల్లర్'తో ధనుష్ కూడా వస్తున్నారు. ఆ రోజున మరో సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


డిసెంబర్ 15న వైభవ్ 'ఆలంబన' విడుదల
యువ కథానాయకుడు, సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ (Vaibhav Reddy) నటించిన సినిమా 'ఆలంబన'. డిసెంబర్ 15న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వెల్లడించింది. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' విడుదల కూడా ఆ రోజే. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల మధ్య క్లాష్ కామన్! 


'ఆలంబన'లో వైభవ్ సరసన మలయాళ భామ, యువ కథానాయిక పార్వతి వేణుగోపాల్ నాయర్ (Parvathy Nair) నటించారు. ఈ చిత్రానికి పారి కె విజయ్ దర్శకుడు. కోటపాడి జె. రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. 


కుబేరుడు టు పేదవాడు... 
'ఆలంబన' కథ ఏమిటి? 
Aalambana movie story in Telugu : 'ఆలంబన' కథ విషయానికి వస్తే... హీరో వైభవ్ రెడ్డి అపర కుబేరుల ఇంట్లో జన్మిస్తాడు. అయితే... దురదృష్టవశాత్తు హీరో ఫ్యామిలీ ఆ ఆస్తి అంతటినీ కోల్పోతుంది. రాజభవనం లాంటి ఇల్లు వదిలి నడిరోడ్డు మీదకు కట్టుబట్టలతో వచ్చేస్తారు. అప్పుడు హీరో జీవితంలోకి జీని అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు ఎదురైన పరిస్థితులను జీనీ సహాయంతో హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అనేది వెండితెరపై చూడాలి. 


Also Read : 'ఘోస్ట్' సినిమా రివ్యూ : శివ రాజ్‌కుమార్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?






''ప్రేక్షకులకు వినోదం అందించే చిత్రమిది. హీరోతో పాటు వాళ్ళ కుటుంబానికి ఎదురయ్యే పరిస్థితులు కడుపుబ్బా నవ్విస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, పాటలు, సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి'' అని చిత్ర బృందం పేర్కొంది.


Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ



వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన 'ఆలంబన'లో మురళీ శర్మ, మునీష్ కాంత్, దిండిగల్ ఐ లియోని, పాండియరాజన్, ఆనందరాజ్, మురళీ శర్మ, కబీర్ సింగ్, కాళీ వెంకట్, రోబో శంకర్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నృత్యాలు : షెరీఫ్, కూర్పు : సాన్ లోకేష్, స్టంట్స్ : పీటర్ హెయిన్, కళా దర్శకత్వం : గోబీ ఆనంద్, ఛాయాగ్రహణం : వినోత్ రతిన్ సామి, సంగీతం : హిప్ హాప్ తమిళ, దర్శకత్వం : పారి కె విజయ్.