‘చంద్రముఖి’ సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. కొన్నేళ్ల తర్వాత ‘నాగవల్లి’ అంటూ ‘చంద్రముఖి’ రిలేటెడ్ స్టోరీతో ఓ సినిమాను విడుదల చేశారు. దీనికి కూడా పి.వాసు యే దర్శకుడు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాను కూడా పి.వాసు తెరకెక్కిస్తున్నాడు. 


సూపర్ స్టార్ రజనీ కాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో 2005 లో వచ్చింది ‘చంద్రముఖి’ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రముఖి పాత్ర గురించి. ఈ పాత్రను జ్యోతిక చేసింది. చంద్రముఖి గా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ‘చంద్రముఖి’ పేరు చెప్తే వెంటనే జ్యోతిక హారర్ లుక్ గుర్తొచ్చేస్తుంది. అంతలా ఈ మూవీ ప్రభావం చూపింది. అలాంటి పాత్రను ఇప్పుడు తెరకెక్కబోతున్న ‘చంద్రముఖి 2’ లో  చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపించబోతోంది. మొదటి పార్ట్ చివరలో రాజు తన కళ్ల ముందే చనిపోవడంతో పగతీర్చుకున్న చంద్రముఖి జ్యోతిక శరీరాన్ని వదిలి వెళ్లిపోయినట్లు చూపించారు. అయితే ఇప్పుడు తీయబోయే సెకండ్ పార్ట్ లో అక్కడ నుంచే సినిమా మొదలుపెడతారా లేదా కొత్త కథతో వస్తారా అనేది తెలియాలి. చంద్రముఖి పాత్రలోనే కంగనా కనిపిస్తుందా లేదా ఆమె పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది. 


అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన మేకర్స్..


ఇక ‘చంద్రముఖి 2’ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ పార్ట్ 2 లో రాఘవ లారెన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చంద్రముఖి గదిలోకి రాఘవ లారెన్స్ చూస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మూవీ కి సంబంధించిన వివరాలు అన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక 2008 లో వచ్చిన ‘ధామ్ ధూమ్‍’ తో తమిళ్ లో తెరంగేట్రం చేసింది కంగనా రనౌత్. ఆ తర్వాత బాలీవుడ్‍కు వెళ్లి స్టార్ హీరోయిన్‍ గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఈ మూవీలో నటిస్తుందని తెలియడంతో ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి.  


Also Read: ఉదయనిధి, వడివేలు మూవీ ‘మామన్నన్’ వివాదానికి కారణం ఏమిటీ? కోర్ట్ ఏం చెప్పింది?