స్వప్నని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం రాజ్ కావ్యని తన పుట్టింటికి తీసుకుని వెళ్తానని చెప్పేసరికి అపర్ణ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. తన మాటలేమీ పట్టించుకోవద్దని వెళ్ళమని శుభాష్ చెప్తాడు. ఆహా ఇది కదా నేను కోరుకుంది. తల్లి కొడుకుల మధ్య చిచ్చు రగులుకుందని రుద్రాణి మనసులో తెగ సంబరపడిపోతుంది. కళ్యాణ్ కనకానికి ఫోన్ చేసి కావ్య వాళ్ళు వస్తునట్టు చెప్పేసరికి సంతోషంతో గట్టిగా అరుస్తుంది. ఈ విషయం చెప్పినట్టు అన్నయ్య, వదినకి చెప్పొద్దని చెప్తాడు. తీన్మార్ డాన్స్ వేసి తెగ సంబరపడిపోతుంది. ముగ్గురు బిడ్డల తల్లివి కాస్త కంట్రోల్ చేసుకోమని అప్పు చెప్తుంది.


Also Read: తులసి బ్యాచ్ ముందు అడ్డంగా బుక్కైన విక్రమ్- మాజీ భార్యకి చీర కొనిచ్చిన నందు


కావ్య రాజ్ వైపు అనుమానంగా చూస్తుంది. ఏంటి వింతగా చూస్తున్నావాని అంటాడు. మళ్ళీ ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. మీ అమ్మ అంటే చాలా ఇష్టం ప్రేమ కదా ఇవాళ తన మనసు గాయపరిచి మరీ నన్ను పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది. నా కుటుంబానికి జరిగిన పరువు నష్టం, నాకు జరిగిన అన్యాయం, నువ్వు చేసిన మోసం అన్నింటికీ కారణం నువ్వేనని అంటాడు. సిగ్నల్ పడి కారు ఆగడంతో ఒక మల్లెపూలు అమ్మే మహిళ వస్తుంది. కొత్త పెళ్లి కూతురులాగా ఉంది పూలు తీసుకోమని చెప్తుంది. వద్దని అనేసరికి ఇంత పిసినారిని ఎలా పెళ్లి చేసుకున్నావాని అనేసరికి రాజ్ చేసేది లేక పూలు తీసుకుంటాడు. నాకు పూలంటే చాలా ఇష్టం మీ చేత్తో మీరు మొదటి సారి కొన్నారు అవి నాకు ఇంకా పవిత్రం ఇవ్వమని చేయి చాపుతుంది. కానీ రాజ్ వాటిని ఇవ్వకుండా వినాయకుడి ముందు పెడతాడు. భర్త ప్రేమ దక్కేది కొందరికేనని కావ్య బాధపడుతుంది.


కారులో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. దీంతో దేవుడి ముందు పెట్టిన పూలు జారీ కావ్య చేతిలో పడతాయి. మహా ప్రసాదం మీరు కొన్నారు దేవుడు ఆశీర్వదించి నాకు ఇచ్చాడు ఇంతకన్నా అదృష్టం ఏముంటుందని కావ్య వాటిని తన జడలో పెట్టుకుంటుంది. ఇల్లు చిమ్మడానికి చీపురు, కర్ర పట్టుకుని కృష్ణమూర్తి ఎదురుగా నిలబడి లేవమని చెప్తుంది. ఏమైందని అనేసరికి అత్తని అయ్యానని చెప్పి ఇల్లు దుమ్ము దులుపుతూ హడావుడి చేస్తుంది. అమ్మాయిని తీసుకుని అల్లుడు వస్తున్నాడని చెప్పేసరికి కృష్ణమూర్తి నమ్మడు. ఏదైనా కల కన్నావా అని వెటకారం చేస్తాడు. తర్వాత అప్పు రాజ్ అక్కని తీసుకుని వస్తున్నాడని చెప్తుంది. వాళ్ళు రావడం నిజమే కావచ్చు కానీ కావ్యని వాళ్ళు అంత తొందరగా కోడలిగా ఒప్పుకున్నారంటే నమ్మనని నోరెళ్ళబెడతాడు. గదిలో స్వప్న ఫోటో చూసి కనకం రగిలిపోతుంది. వెంటనే కోపంగా స్వప్న వస్తువులన్నీ మూటకట్టి బయట పారేయమని చెప్తుంది.


Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర


స్వప్న గుడిలో నిద్రపోతుంది. గుడి శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు స్వప్నని నిద్రలేపి పని చేసుకోవాలి వెళ్లిపొమ్మని చెప్తారు. ఏంటో లేచిపోవడం తప్పు చేయడం, మోసపోవడం కన్నా వాళ్ళు ఏమై పోతారో కూడా పట్టించుకోరని అందులో ఒక ఆమె అనేసరికి స్వప్న బాధగా వెళ్ళిపోతుంది. దీనంతటకీ కారణం రాహుల్ ఎలా పెరిగాను నేను ఎక్కడ ఉన్నానని అనుకుంటుంది. పూజారి వచ్చి నువ్వు ఇక్కడే ఉంటే నాకు సమస్య అవుతుంది. నీ తప్పుని క్షమించలేకపోయినా నీ కన్నవాళ్ళు తప్పకుండా క్షమిస్తారు, నువ్వు మీ ఇంటికే వెళ్ళమని సలహా ఇస్తాడు.