బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టేవారు ముందుగానే గత సీజన్లు అన్నీ చూసి బాగా ప్రిపేరవుతారు. అయితే కొన్ని సీన్లు మాత్రం అనుకోకుండా రిపీట్ అవుతూ ఉంటాయి. తాజాగా నాగ మణికంఠ, యష్మి గౌడ మధ్య జరిగిన గొడవను చూస్తే బిగ్ బాస్ చరిత్ర రిపీట్ కాబోతోందా అనే అనుమానం కలుగుతుంది. అయితే ఒకవేళ అదే జరిగితే ఇందులో యష్మి కంటే నాగ మణికంఠకే ఎక్కువ లాభం ఉంటుంది. నాగ మణికంఠ, యస్మి మధ్య జరిగిన గొడవ ఏంటి ? రిపీట్ కాబోతున్న ఆ చరిత్ర ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 


శ్రీముఖి, రాహుల్ బాటలో యష్మి గౌడ, మణికంఠ 
బిగ్ బాస్ మూడో వారం నామినేషన్లలో భాగంగా యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాజాగా మూడవ వారం నామినేషన్లు లాన్ ఏరియాలో జరగగా, అక్కడ షో మేకర్స్ ట్రాష్ ఏరియాను ఏర్పాటు చేశారు. ఈసారి నామినేషన్ల కోసం ట్రాష్ బిన్ థీమ్ ను తీసుకున్న బిగ్ బాస్ చెత్త వేసి తాము నామినేట్ చేయాలనుకున్న వారిని నామినేట్ చేయాలని సూచించారు. ఈ నామినేషన్ల సమయంలోనే నాగ మణికంఠ వర్సెస్ యష్మి గౌడ అన్నట్టుగా మారింది పరిస్థితి. యష్మి గౌడ, నాగ మణికంఠల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, యష్మి గౌడ ఆవేశంలో తను ఇంట్లో ఉన్నంత వరకు నాగ మణికంఠనే నామినేట్ చేస్తానని శపథం చేసింది. అయితే సీజన్ 3 లో ఇలాగే శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ ను వరుసగా నామినేట్ చేసింది. ఆ తర్వాత కూడా పలు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఇప్పుడు యష్మి గౌడ, నాగ మణికంఠ మధ్య ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక స్ట్రాటజీనా ? అనే అనుమానం కలుగుతోంది. 


Read Also : Bigg Boss Telugu 8 Day 15 Promo 2: నీది ఎమోషన్ అయితే నాది మోషనా అంటున్న పృథ్వీ, సోనియా క్లాన్ పై ఇంట్రెస్ట్ పెట్టలేదా?




ఇప్పుడు యష్మి గౌడ, మణికంఠని సీజన్ మొత్తం నామినేషన్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే సీజన్ 2లో గీతా మాధురి, కౌశల్ ని నామినేట్ చేసింది. సీజన్ 3 లో శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ ను నామినేట్ చేసింది. సీజన్ 5లో ప్రియా.. వీజే సన్నీని నామినేట్ చేసింది. అయితే ఈ 2, 3, 5 సీజన్లలో కంటిన్యూగా నామినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ కౌశల్, రాహుల్ సింప్లిగంజ్, వీజే సన్నీ బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యి ఈ యష్మి గౌడ కారణంగా నాగ మణికంఠ విన్నర్ అయితే గనక బిగ్ బాస్ చరిత్ర రిపీట్ అయినట్టే. మరి గతంలో ఆ ముగ్గురు విషయంలో పని చేసిన సింపతి కార్డు నాగమణి కంఠకు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే నాగ మణికంఠ మొదటి వారం మొత్తం ఏడుపుతోనే లాక్కొచ్చాడు. ఇప్పుడిప్పుడే తనలో ఉన్న ఫైర్ ని బయట పెడుతున్నాడు. ఇలాంటి టైంలో మళ్లీ యష్మి గౌడ అతన్ని టార్గెట్ చేస్తూ సీజన్ మొత్తం నామినేట్ చేస్తాను అని చెప్పడంతో జనాలకు అతనిపై సింపతీ పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఆయనకు గట్టి సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయినా అవ్వచ్చేమో.


Read Also :Sekhar Basha: ఎలిమినేషన్ వెనకున్న కారణం ఇదే - సీక్రెట్ బయట పెట్టేసిన శేఖర్ బాషా