బిగ్ బాస్ హౌస్ ఆరు వారాలను పూర్తి చేసుకొని ఏడో వారంలోకి ఎంటర్ అవ్వబోతుంది. ఈసారి సాక్రిఫైస్ నామినేషన్స్ జరిగాయి. హౌస్ మేట్స్ ని ఇద్దరు చొప్పున పిలుస్తూ.. వారిలో ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పారు బిగ్ బాస్. అయితే చాలా జంటలు రాజీ పడకపోవడంతో ఇద్దరూ నామినేట్ అయ్యారు. అఖిల్, బిందు చాలా సేపు ఆర్గ్యూ చేసుకొని ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇద్దరూ నామినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్, శివ విషయంలో కూడా ఇలానే జరిగింది. అలానే అషురెడ్డి తన స్పెషల్ పవర్ వాడుకొని మహేష్ విట్టాను నామినేట్ చేసింది. 


అలా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం అన్ అఫీషియల్ ఓటింగ్ చూసుకుంటే గనుక బిందు మాధవి, అఖిల్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అలానే యాంకర్ శివకి కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. వీరు ముగ్గురూ ఈ వారం కూడా సేవ్ అయిపోతారు. అలానే మహేష్ విట్టా, మిత్రాశర్మలు కూడా ఓటింగ్ లో సేఫ్ జోన్ లో కనిపిస్తున్నారు. 


మిగిలిన ముగ్గురు అరియనా, నటరాజ్ మాస్టర్, అనిల్ లు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈసారి అనూహ్యంగా అరియనా డేంజర్ జోన్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండే అరియనా.. తొలిసారి ఎలిమినేషన్స్ డేంజర్ లో కనిపిస్తోంది. ఈ వారం అరియనా, నటరాజ్ లలో ఎవరైనా ఎలిమినేట్ అయితే గనుక హౌస్ మేట్స్ లో టెన్షన్ రావడం ఖాయం. 


బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ లో అరియనా చివర్లో ఉంటే మాత్రం ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఆమె సేవ్ అయితే గనుక నటరాజ్ మాస్టర్, అనిల్ లలో ఒకరు బయటకు వెళ్తారు. కానీ ఎక్కువ శాతం అరియనా, నటరాజ్ మాస్టర్ లలో ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!


Also Read:'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?