బిగ్ బాస్ సీజన్ 7లో తమ మధ్య జరిగిన గొడవలను ఇంకా కొందరు కంటెస్టెంట్స్ మర్చిపోలేదు. అందుకే బయటికి వచ్చిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్.. తమ తోటి కంటెస్టెంట్స్‌లో కొంతమందిని మాత్రమే కలవడానికి ఇష్టపడుతున్నారు. ఇక శివాజీ కూడా ఇప్పటివరకు కంటెస్టెంట్స్ అందరినీ ఏమీ కలవలేదు. కేవలం తన ఫ్రెండ్స్ అయినా శివాజీ, యావర్‌లనే ఎక్కువసార్లు కలిశాడు. వారితో పాటు మరికొందరని కలిశాడు. ఇక హౌజ్‌లో ఉన్న సమయంలో శోభాతో జరిగిన గొడవపై శివాజీ స్పందించాడు.


అదే నాకు నచ్చని విషయం..
‘‘నాకు అర్థమయ్యింది ఏంటంటే వాళ్లంతా కావాలని గొడవలు పెట్టుకున్నారు. ఎంతోకొంత ఆర్టిస్ట్‌ను కదా.. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అటెన్షన్ వస్తుందనే అయ్యిండొచ్చు.. లేకపోతే అరిచి, గొడవ చేస్తే జనం అట్రాక్ట్ అవుతారు అని అయ్యిండొచ్చు.. ఏదైనా కానీ రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. నాకు నచ్చని విషయం ఏంటంటే శోభా కన్ఫెషన్ రూమ్‌లో తను కన్నడ అమ్మాయి అని చెప్పింది. అలాంటి ఫీలింగ్ మీ మనసులో ఉంటే తెలుగువాళ్లు ఎవరూ మిమ్మల్ని ఆదరించేవారు కాదు. దయజేసి మెచ్యురిటీ లేకుండా అలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీ నటన బాగుందని ఎంకరేజ్ చేశారు. తెలుగువాళ్లు ఎప్పుడూ అలాగే చేస్తారు. నువ్వే అనవసరంగా గెలుక్కున్నావు. నాకు చాలా చీప్‌గా అనిపించింది. అలాంటివి ఎప్పుడూ చేయకు. ఆరోజు తను చేసిన ఓవరాక్షన్ అంతా చూసిన తర్వాత ఎందుకు ఈ పిల్ల లైఫ్‌ను పాడుచేసుకుంటుంది అనుకున్నాను. మొదట్లో నాతో చాలా బాగుండేది. మా పిల్లలు కూడా మొదటి ఆరు వారాలు బాగుంది నాన్న నీతో అని’’ అంటూ శోభా గురించి, తనతో జరిగిన గొడవ గురించి చెప్తూ.. మధ్యలో తనకు సలహా కూడా ఇచ్చాడు శివాజీ.


నీ కెరీర్‌కు మంచిది కాదు..
‘‘మీరు ఇక్కడ చేసేదే మీ నిజ జీవితంలో క్యారెక్టర్ అని అందరికీ చెప్పేవాడిని. జాగ్రత్తగా మీ జీవితాన్ని మలచుకోండి అని హెచ్చరించేవాడిని. ఆ తర్వాత మన కలర్స్ ఇప్పటినుంచి బయటికొస్తాయని బాబుగారు అన్నారు. భగవంతుడు బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత మనల్ని మనం మార్చుకునే అవకాశం ఇచ్చాడు. మనిషికి ఓపిక చాలా ముఖ్యం, ఆ ఓపిక లేకపోతే జీవితాలు దెబ్బతింటాయి. శోభా తన జీవితాన్ని మార్చుకునే అవకాశం బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా దొరికింది. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఎవడిని? నేను ఒక ఆర్టిస్ట్‌నే. నాకు నచ్చకపోయినంత మాత్రానా మిమ్మల్ని ప్రపంచమంతా వెలేస్తుందా? నువ్వు మాట్లాడిన మాటలు నీకు మంచివి కాదు, నీ కెరీర్‌కు మంచిది కాదు’’ అంటూ శోభాకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. 


నా దగ్గర అంత డబ్బు లేదు..
ప్రశాంత్, యావర్ తనకు రెండు కళ్లులాంటి వాళ్లని మరోసారి తెలిపాడు శివాజీ. ‘‘ప్రశాంత్.. మనం తమిళ సినిమాల్లో చూసే ఆర్టిస్ట్‌లాంటివాడు. ధనుష్‌లాగా చేయగలిగిన కెపాసిటీ తన దగ్గర ఉంది. కాకపోతే వాడిని మలిచేవాడు కావాలి. మరి ధనుష్ అంతా అని నేను కానీ ఇంత కప్ కొట్టాడు, అంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎందుకు కాకూడదు.. అవుతాడేమో. నేనుగా మిమ్మల్ని పెద్ద ఆర్టిస్టులను చేయలేను. నా దగ్గర అంత డబ్బు లేదు అని వాళ్లతో చెప్పాను. కానీ నాకు తెలిసిన దర్శకులను, నిర్మాతలను కలిపిస్తాను అనే మాట మాత్రం చెప్పాను. వాళ్లకు నా మీద ఎలాంటి ఆశలు లేవు. మనస్ఫూర్తిగా అభిమానించారు, గౌరవించారు’’ అంటూ ప్రశాంత్, యావర్‌లపైన ప్రేమను బయటపెట్టాడు శివాజీ. ఇక పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లినప్పుడు తాను అందరి ముందుకు రాకపోయినా.. వెనక ఉండి నడిపించానని అన్నాడు.


Also Read: ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది, అందరిలో అమర్‌దీప్ బెటర్ - శివాజీ