బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ పూర్తయ్యాయి. అవి పూర్తయ్యే సమయానికి చాలామంది హౌజ్‌మేట్స్ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు హౌజ్‌మేట్స్ మధ్య మనస్పర్థలు తొలగిపోయినట్టు కనిపించినా.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం మాత్రం మానేయలేదు. అయితే ఈ మొదటి నామినేషన్స్ అయిపోయే సమయానికి బిగ్ బాస్ హౌజ్‌లో, ప్రేక్షకుల్లో అటెన్షన్ విషయంలో మహిళలదే పైచేయి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ప్రేక్షకుల అటెన్షన్ కోసం ఎదురుచూస్తున్నట్టు, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపించింది.


అప్పుడే కన్నీళ్లు..
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లోని 14 మంది కంటెస్టెంట్స్‌లో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇప్పటికీ రెండురోజుల పాటు ఈ సీజన్‌లోని మొదటి నామినేషన్స్ ప్రసారం అయ్యాయి. ఈ రెండు రోజుల్లో మహిళలే ఎక్కువగా కెమెరా ముందు కనిపిస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ సంపాదించుకున్నారు. వారు ఇతరులను నామినేట్ చేయడం, ఇతర కంటెస్టెంట్స్ చేత వారు నామినేట్ అవ్వడం.. ఇలా రెండు రకాలుగా వారికి అటెన్షన్ సంపాదించుకునే అవకాశం లభించింది. ఇక హౌజ్‌లోకి ఎంటర్ అయిన రెండోరోజుకే తన కన్నీళ్లతో సింపథీ సంపాదించుకుంటోంది శోభా శెట్టి. ‘కార్తిక దీపం’ అనే సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శోభ.. అందులో విలన్ క్యారెక్టర్‌తో అందరికీ చెమటలు పట్టించింది. రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటుందేమో అని అనుకున్నారంతా. కానీ దానికి పూర్తి భిన్నం అని ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.


నామినేషన్స్‌లో తనే హైలెట్..
ముందుగా శోభా శెట్టి.. గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది. తనతో బాండింగ్ లేకపోవడమే దీనికి కారణమని చెప్పింది. అక్కడ నుండి గొడవ మొదలయ్యింది. అసలు సమస్యను పరిష్కరించుకుందామని శోభాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు గౌతమ్. కానీ గౌతమ్‌ను మాట్లాడనివ్వకుండా పంతంతో ఉండిపోయింది శోభా. వీరిద్దరి మధ్య రెండుసార్లు జరిగిన వాగ్వాదం.. ప్రేక్షకుల్లో ఫుల్ అటెన్షన్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత దామిని.. శోభా ఏమీ పనిచేయడం లేదంటూ తనను నామినేట్ చేసింది. ఈ కారణంతో దామినితో గొడవకు దిగింది శోభా. తను ఉదయం నుండి చాలా పనిచేసిందంటూ నిరూపించుకుంది. ఆ తర్వాత పనిచేసినా చేయడం లేదని ఆరోపిస్తున్నారు అంటూ గార్డెన్‌లో కూర్చొని ఏడ్చింది. దీంతో ప్రేక్షకులు శోభాను డ్రామా క్వీన్ అనేస్తున్నారు.


అసలు పనిచేయడం లేదు..
సింగర్ దామిని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా నామినేషన్స్‌లో పాల్గనడంతో అసలు తను ఏంటి ఇలా చేసింది అని ప్రేక్షకులు తనపై కూడా ఫోకస్ పెట్టారు. ఇక షకీలా లాంటి సీనియర్ నటి వచ్చి బిగ్ బాస్‌లో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంది అనుకున్నా కూడా తన వల్ల ప్రేక్షకులకు పెద్దగా ఎంటర్‌టైన్మెంట్ లభించలేదు. కేవలం యావర్ విషయంలో మాత్రమే షకీలా యాక్టివ్ అయ్యారు. చివరిగా శోభా శెట్టితో పాటు ప్రేక్షకుల అటెన్షన్‌ను ఎక్కువగా సంపాదించుకున్న మరో మహిళా కంటెస్టెంట్ రతిక. సీక్రెట్ టాస్క్ అంటూ తనలోని ఫైర్‌ను బయటపెట్టిన రతిక.. ఆ తర్వాత అసలు ఏమీ పనిచేయడం లేదంటూ అందరి చేత నామినేట్ చేయించుకోబడింది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 చూస్తుంటే ఈసారి డామినేషన్.. మహిళా కంటెస్టెంట్స్‌దే అని అర్థమవుతోంది.


Also Read: శివాజీకి నిజంగానే పెళ్లి కాలేదా? నాగార్జునతో ఒకలా, హౌజ్‌మేట్స్‌తో మరోలా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial