Bigg Boss 8 Contestants List: మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ మొదలు కానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బిగ్‌బాస్‌ సీజన్‌ 8 గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతోంది. ‌ఇప్పటికే ప్రమోషన్స్‌, ప్రొమోలతో షోపై హైప్‌ పెంచాడు హోస్ట్‌ నాగార్జున. ఈ క్రమంలో ఈసారిలో హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్‌ ఎవరాని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సీజన్‌ 8 కంటెస్టెంట్స్‌ ఫైనల్‌ లిస్ట్‌ ఇదే అంటూ ఓ జాబితా నెట్టింట వైరల్‌ అవుతుంది.


ఊహించని పేర్లు


ఆదిత్య ఓం, నిఖిల్‌ మళియక్కల్‌, అంజలి పవన్‌, యష్మి గౌడ, అభయ్‌ నవీన్‌, యాంకర్‌ విష్ణుప్రియ, అభిరామ్‌ వర్మ, కిర్రాక్‌ సీత, ఖయ్యూం అలీ,  నాగ మణికంఠ, సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌ బెజవాడ బేబక్క , రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుతో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్‌ భాషా, సాహర్‌ కృష్ణన్‌, కళ్యాణి, విస్మయ శ్రీ, నైనిక అనసురు, సోనియా ఆకుల ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సారి హౌజ్‌లోకి మాజీ కంటెస్టెంట్స్‌ కూడా రాబోతున్నారట. ఈ 17 మందితో పాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు మాజీ కంటెస్టెంట్స్‌లో రాబోతున్నట్టు తెలుస్తోంది. సీజన్‌ 1 నుంచి సీజన్‌ 7 వరకు అన్ని సీజన్లలో ఎవరైన రావోచ్చు అంటున్నారు.






మాజీ కంటెస్టెంట్స్ కూడా?


అందులో సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌ ముక్కు అవినాష్‌, బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్‌ ఆర్జే చైతూతో బిగ్‌బాస్‌ టీం సంప్రదింపులు జరిపిందని గుసగుస. ఈ లీస్ట్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. మొన్నటి వరకు వినిపించిన పేర్లు ఇందులో కనిపించడం లేదు.  టీవీ నటుడు ఇంద్రనీల్‌, నటి తేజస్వీని గౌడ, రితూ చౌదరి, హీరో అబ్బాస్‌ అంటూ పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఈ జాబితాలో వాళ్లు కనిపించకపోవడంతో నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. అయితే ఇందులో దాదాపుగా ఎవరూ పెద్దగా ఆడియన్స్‌కి పరిచయం లేదనిపించేలా ఉన్నాయి కంటెస్టెంట్ల పేర్లు. మరి చూడాలి ఈ లిస్ట్‌లోని వారే వస్తారా? లేదా ఇంకా కొత్తవారేవరైనా వస్తారానేది క్లారిటీ రావాలంటే మరో నాలుగు వేచి చూడాల్సిందే. ఇప్పటి విడుదలైన ప్రొమోలో హోస్ట్‌ నాగార్జున ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిట్‌ లేదంటూ షోపై ఆసక్తి పెంచారు.



సీజన్ 7 బ్లాక్‌బస్టర్


ఇక ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌ని చాలా పెద్దగా సెట్‌ చేశారు. కంటెస్టెంట్స్‌ ఎంట్రీతోనే గ్రూప్‌లుగా డివైడ్‌ చేసి ఆడించనున్నారట. ఈ సారి సరికొత్త థీమ్‌తో బిగ్‌బాస్‌ షోను తీసుకువస్తున్నట్టు టాక్‌. కాగా గత బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు.   కామన్ మ్యాన్ అంటూ రైతుబిడ్డన, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పల్లవి ప్రశాంత్‌ను కంటెస్టెంట్‌గా తీసుకువచ్చారు. పల్లవి ప్రశాంత్ తరచూ గొడవ పడుతూ, తన డైలాగులు, మ్యానరిజంతో ఇతర కంటెస్టెంట్స్‌కి చిరాకు పెట్టించాడు. ముఖ్యంగా నామినేషన్‌లో టైంలో అమర్‌ దీప్‌, ప్రశాంత్‌ల మధ్య వాగ్వాదంలో యమ హీట్‌ పెంచేది. ప్రతివారం వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా? అని ఆడియన్స్‌లో ఆసక్తి ఉండేది. అలాగే కొత్తగా అనిపించిన టాస్క్‌లు, కంటెస్టెంట్స్‌ అలకలు, గొడవలు అన్ని కూడా సీజన్ 7 బ్లాక్‌బస్టర్ హిట్‌ చేశాయి.



Also Read: ‘బిగ్ బాస్’కు వెళ్తున్నారు అంట నిజ‌మేనా? రాజ్ త‌రుణ రియాక్ష‌న్ ఏంటో చూడండి