Bigg Boss 8 Telugu Episode 18 Day 17:


బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కాస్త రసవత్తరంగానే సాగుతోంది. రేషన్ కోసం కంటెస్టెంట్లు టాస్కులు ఆడారు. అందులో నిఖిల్ క్లాన్ నచ్చిన ఆహారాన్ని సంపాదించుకుంది. ఓడిన అభయ్ క్లాన్‌కు సాధారణ రేషన్ వచ్చింది. ఇక ప్రభావతి 2. ఓ అంటూ పెట్టిన టాస్కుతో ఇంట్లో ఫిజికల్ వయలెన్స్ ఎక్కువైంది. ఎవరు ఎవరిని లాగేస్తున్నారు.. ఎవరు ఎవర్ని ఎత్తి పడేస్తున్నారన్నది అర్థం కాకుండా పోయింది. ఇక ఈ మధ్యలో విష్ణు ప్రియ దోశ పంచాయితీ.. సోనియా ప్రేమ కహానీలతో బుధవారం నాటి ఎపిసోడ్ పర్వాలేదనిపించింది.


బూర కొట్టు రేషన్ పట్టు టాస్కులో సంచాలక్‌గా సోనియా ఫెయిల్ అయిందన్న సంగతి తెలిసిందే. సోనియా చేసిన పనులు, నిఖిల్ అభయ్‌లు ఆడిన ఆట గురించి ఇంట్లో చర్చలు జరిగాయి. యష్మీ అయితే నిఖిల్ మీద, సోనియా మీద మండిపడింది. కావాలని చేసినట్టుగా అయితే తనకు అనిపించలేదని సీత చెప్పుకొచ్చింది. సంచాలక్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంతో అభయ్ హర్ట్ అయ్యాడు. ఇంట్లో ఏ పని చేయమని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎవరి పనులు వాళ్లే చేయాలని చీఫ్‌గా ఆదేశాలిచ్చాడు.


Read Also: ఇదో లఫూట్ గేమ్, వాడో వరస్ట్ ప్లేయర్ అంటూ నోరు జారిన అభయ్- మళ్లీ బరస్ట్ అయిన మణికంఠ


దీంతో ఆకలి అంటూ వంటగదిలోకి వచ్చిన విష్ణుకి దోశలు వేసి ఇచ్చేందుకు ప్రేరణ సుముఖత వ్యక్తం చేయలేదు. మధ్యలో మణికంఠ దూరి.. విష్ణుప్రియకి దోశ వేసిచ్చాడు. ప్రేరణ దోశ వేసిన తీరు నచ్చలేదని అడుక్కునే వాళ్లకి వేసినట్టుగా వేసిందని తెగఏడ్చేసింది. ఆ మ్యాటర్‌ను విష్ణు ప్రియ సాగదీసింది. ఏడుపులు పెడబొబ్బులతో నసపెట్టింది. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి.. మణికంఠ మీద ప్రేరణ మండిపడింది. సోనియాతో ఫ్రెండ్ షిప్ చేశాక నిఖిల్ పూర్తిగా మారిపోయాడని సీత తన క్లాన్ సభ్యులకు చెప్పుకొచ్చింది.


టాస్కులు గెలిచిన శక్తి టీంకు సూపర్ మార్కెట్లో, ఓడిన కాంతార టీంకు జనరల్ మార్కెట్లో షాపింగ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. ఆ తరువాత సోనియా తన ప్రేమ కథను ప్రేరణకు చెప్పింది. తాను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదని, తాను పని చేసే ఎన్జీవోకి వెబ్ సైట్ డిజైన్ చేసే పనుల్లో ఆయన పరిచయం అయ్యాడని, అలా జర్నీ స్టార్ట్ అయిందని.. ఇంకా ఏదో ప్రేరణ చెవుల్లో సోనియా గుసగుసలాడింది. ఇక ప్రభావతి 2.ఓ గుడ్లను కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు. గత సీజన్లోనూ ఇలాంటి టాస్కే పెట్టాడు.


Read Also: వైల్డ్ కార్డు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్, నలుగురు కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్


ఇప్పుడు ప్రభావతి 2.ఓ అంటూ తీసుకొచ్చారు. ఈ ఆటలో నిఖిల్, పృథ్వీ ఇలా అందరూ అగ్రెసివ్ అయ్యారు. చివరకు మణికంఠను నిఖిల్ ఎత్తి అవతల పారేశాడు. దీంతో మణి అక్కడే పడిపోయాడు. దీంతో బిగ్ బాస్ ఆటకు బ్రేక్ ఇచ్చాడు. మెడికల్ రూంకి రమ్మన్నాడు. ఇక మణికంఠకు బాగా లేదని రెస్ట్ తీసుకోమని అభయ్ చెప్పాడు. కానీ ఈ గేమ్ తనకు జీవితం అని, కచ్చితంగా ఆడతాను అని ఏడ్చేశాడు. మరో వైపు నబిల్ తన మీద వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చుకున్నాడు. విష్ణు ప్రియ పదే పదే టచ్ చేశాడని చెబుతోందని, తాను టచ్ చేయలని, కేవలం ఎగ్స్ కోసం ట్రై చేశానంటూ చెప్పుకొచ్చాడు. చివరకు ఇదొక పంచాయితీ అయింది. అలా ఈ టాస్కు ఇంకా మధ్యలోనే ఆగినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు క్తి టీం 66, కాంతార టీం 34 ఎగ్స్ సంపాదించింది. మరి గురువారం నాటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.