బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ వీకెండ్ గరం గరంగా ఉండబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా బిగ్ బాస్ ఈ విషయాన్ని బయట పెట్టారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రావడం, హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ మొట్టికాయలు వేయడం ఇదివరకు జరిగిన ప్రతి సీజన్లో చూసాం మనం. అయితే ఈ సీజన్లో మాత్రం ఫస్ట్ వీకెండ్ హౌస్ మేట్స్ కే జడ్జిమెంట్ వదిలేసారు. అయితే అలా చేయడం ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. అందుకే సెకండ్ వీకెండ్ లో మాత్రం ఫస్ట్ వీకెండ్ ది కూడా కలిపి డబుల్ డోస్ ఫైర్ అయ్యారు నాగార్జున. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం పదండి. 


ఎఫ్ వర్డ్స్ పై ఫైర్ 


తాజా ప్రోమోలో నాగ్ మీ క్లాన్ పర్ఫామెన్స్ ఏంటి అనేది మీరే ఇవాళ తేల్చాలి అని చెప్పారు. "ముగ్గురు చీఫ్ లు గెటప్.." అంటూ యష్మి గౌడతో స్టార్ట్ చేశారు నాగార్జున. ఇక ప్రోమోలో ఒక బోర్డు ను ఇచ్చి రెడ్, గ్రీన్ అనే రెండు అవకాశాలను ఇచ్చారు. బాగా ఆడిన వారిని గ్రీన్ లో, ఆడని వారిని రెడ్ లో పెట్టాలని సూచించారు. ముందుగా యష్మి గౌడ అభయ్ తో స్టార్ట్ చేసింది. అయితే వెంటనే నాగార్జున అందుకుని "నీ ఉద్దేశంలో అభయ్ బాగా ఆడాడు. మరి విష్ణు ప్రియ ఉద్దేశంలో?" అంటూ యష్మి గౌడను ప్రశ్నించాడు.



వెంటనే విష్ణు ప్రియ లేచి "ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న తోసారు. అన్న ఏమో నేను అలా చేయలేదు చేయలేదు అంటున్నారు" అంటూ నాగార్జునతో చెప్పడం ప్రోమోలో కనిపించింది. ఇక ఆ తర్వాత వెంటనే "అసలు అన్న ఏం చేశాడో చూపించనా" అని అనగానే అభయ్ ఫేస్ ని చూపించారు. నెక్స్ట్ పృథ్వి ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చాడని చెప్పింది యష్మి. "మరి వాక్స్ టాస్క్ లో ఏమైంది గివ్ అప్ ఇచ్చేసాడు" అంటూ తిరిగి యష్మి గౌడను ప్రశ్నించారు నాగ్. "కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. హోల్డ్ యువర్ టంగ్.. లేదనుకో" అంటూ గన్ తీసి పృథ్వీని హెచ్చరించారు.



చీఫ్ గా యష్మి గౌడ ఫెయిల్... తేల్చేసిన నాగ్ 



ఇంకా ప్రోమోలో "ప్రేరణ సంచాలక్ గా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది" అంటూ ప్రేరణను రెడ్ ప్లేస్ లో పెట్టింది. వెంటనే నాగార్జున "కన్ఫ్యూజ్ అయ్యిందా ? మీరు చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారా?" అని మళ్ళీ యష్మినే ప్రశ్నించారు నాగార్జున. "ఇక ఎలాగూ సంచాలక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మణికంఠ, సీత టాస్క్ విషయం గురించి మాట్లాడుకుందాం. 250 గ్రాముల విషయంలో నీ డెసిషన్ రైటా?" అని ప్రశ్నించారు.


Read Also: ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా


వెంటనే ప్రోమోలో మణికంఠ లేచి "నేను ముందే డోర్ దగ్గర అడిగాను" అని చెప్పగా, యష్మి "లేదు అడగలేదు" అని వాదించింది. దీంతో "బిగ్ బాస్ వీడియో ప్లీజ్" అంటూ యష్మి గౌడ బాగోతాన్ని బయటపెట్టారు నాగార్జున. వెంటనే యష్మి ఏడుస్తూ "ఇక్కడ ఇద్దరే ఉన్నారు. అక్కడ ఐదుగురు ఆకలితో ఉంటారు. ఎలాగైనా ఈ టీం గెలవాలని నేను అనుకున్నాను" అంటూ చెప్పింది. "మరి దాన్ని ముందే ఒప్పుకోవచ్చు కదా" అని అంటూ నాగార్జున యష్మి గౌడ ఫోటోను గన్ తో కాల్చాడు.  అంతేకాకుండా "నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావు" అంటూ గడ్డి పెట్టారు. 


Also Read: Yashmi Gowda Bigg Boss: ముందు నిన్ను స్కూల్లో పడేయాలి... 'బిగ్ బాస్' యష్మీ గౌడను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు