చిత్తూరు యాసతో ప్రేక్షకులను అలరిస్తోంది గీతూ రాయల్. కానీ ఆమె మరీ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం మాత్రం అప్పుడే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా ఆమె ఇనయా సుల్తానాతో పదేపదే వాగ్వాదానికి దిగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా ఆమె ఇనయానే టార్గెట్ చేసింది. ఇందులో ఆమె ట్రాష్ నుంచి క్లాస్‌కి మారినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలోకి బాలాదిత్య వచ్చాడు. క్లాస్‌లోకి మారాక అందరి చేత సేవలు చేయించుకోవడం మొదలుపెట్టింది. ‘తమ్ముడు బాలా యాక్సెస్ కార్డు ఏడమ్మా’ అంటూ బాలాదిత్యను ఆటపట్టించింది. 


ఇక ఇనయాను అయితే విసిగిస్తూనే ఉంది. ‘ఇనయా నా బాటిల్ తో నీళ్లు తే పో’, ‘ఆరోహి  ఓ గిన్నెతో నీళ్లు తెస్తే చేయి కడుక్కుంటా’ అంటూ సేవలు చేయించుకుంది. పదేపదే ఇనయాను పిలిచి విసిగించడం మొదలుపెట్టింది. ఇనయా రాగానే నిమ్మకాయ నీళ్లు కలిపి ఇవ్వమని అడిగింది గీతూ. నీళ్లు తెచ్చాక ఓ పాట పాడు రాజా అని అడిగింది. దానికి ఇనయా నాకు రాదు అనడంతో, ఓ రైమ్ పాడమని అడిగింది. దానికి ఇనయా పనులు చేయించుకోమన్నారు కానీ పాటలు పాడమని చెప్పలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది.నీ కోం నేనెందుకు పాట పాడాలి, రైమ్ పాడాలి అంటూ సమాధానం ఇచ్చింది. దానికి గీతూ ‘వెళ్లి నా దువ్వెన తీసుకురా’ అని పని చెప్పింది. ఇనయా సీరియస్ గా గార్డెన్లోకి నడుచుకుని వెళ్లిపోయింది. 


గీతూ ప్రవర్తన కొంతమందికి విసుగు తెప్పిస్తే, కొంతమందికి నవ్వుతెప్పించింది. ఆమె కావాలనే ఇనయాను టార్గెట్ చేస్తుందని మాత్రం చూసే ప్రతివారికి అర్థమవుతోంది. ఈసారి ఇనయా వర్సెస్ గీతూ ఫైట్ తప్పేలా లేదు. ఇప్పటికే దాదాపు ఇనయా ఈ వారం నామినేషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో ఉన్న ఇనయాకు గీతూ తలనొప్పిలా మారింది.  






Also read: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ


Also read: బిగ్‌బాస్6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ - ఆమె లీస్ట్,