'అడవిని తగలెట్టడం చూశా

పులిని వేటాడటం చూశా

కానీ, ఆ పొద్దు వేరు దొరా!'

 

- 'భీమ్లా నాయక్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్. ఇది సూపర్ అని నెటిజన్స్ అంటున్నారు. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు  చూసిన ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. తెలంగాణ, ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పడ్డాయి. 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ లభించింది. శివరాత్రి వరకూ థియేటర్లలో పవన్ కల్యాణ్ శివ తాండవం అని కొందరు, పవన్ విధ్వంసాన్ని ఆపలేరని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. పవన్ - రానా మధ్య సీన్స్ సూపర్ అని కొందరు అంటున్నారు. తమన్ నేపథ్య సంగీతం, స్వరాలు అదిరిపోయాయని ఇంకొందరు చెప్పారు. ముఖ్యంగా 'లా లా భీమ్లా' సాంగ్, తెలుగులో త్రివిక్రమ్ ప్రత్యేకంగా రాసిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సూపర్ అనేది సోషల్ మీడియా టాక్.