Vaishnavi Chaitanya New Movie: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది క్యూట్ బ్యూటీ వైష్ణవి చైతన్య. ఒకే ఒక్క సినిమాతో  టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బస్తీ అమ్మాయిగా, మోడ్రన్ బ్యూటీగా ఆకట్టుకుంది. ఆమె అద్భుత నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. ఈ మూవీతో పాటు మరో క్రేజీ ఆఫర్ కు ఓకే చెప్పింది.


దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోయిన్ అవకాశం


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్  హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్‍గా ఎంపిక అయ్యింది .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.   






షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు


'సాప్ట్ వేర్ డెవలపర్' షార్ట్ ఫిలిమ్ తో సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలుత సైడ్ క్యారెక్టర్ చేసింది. పాత్ర ఏదైనా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమె ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.  ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆశ్విన్, వైష్ణవి లీడ్ రోల్స్ లో ఈ మూవీ రూపొందింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అందుకుంది. యూత్ ను బాగా ఆకట్టుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో వైష్ణవి నటనను అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం వైష్ణవి రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా లవ్ స్టోరీసే కావడం విశేషం.


‘బేబీ’ కాంబోలో మరో మూవీ చేస్తున్న వైష్ణవి


నిజానికి ‘బేబీ’ సినిమా తర్వాత వైష్ణవి వెంటనే అవకాశాలు రాలేదు. కొద్ది రోజుల తర్వాత  మళ్లీ  ‘బేబీ’ కాంబోలోనే సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. సాయి రాజేష్ ఈ సినిమాకు కథను అందించారు. నంబూరు రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


Also Read: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?