బుల్లితెర అందాల భామ.. నవ్యస్వామికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఏ సీరియల్‌లో కనిపించినా అది హిట్టే. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన చెందిన నవ్య.. ‘తంగాలీ’ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. బీబీఎం పూర్తిచేసిన వెంటనే ఆమె టీవీ రంగంలోకి వచ్చింది. మొదట్లో ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే సీరియల్స్‌లో కనిపించిన నవ్య ఆ తర్వాత ‘స్టార్ మా’ సీరియల్స్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది.


ముఖ్యంగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ ద్వారా నవ్య మంచి పేరు సంపాదించుకుంది. అయితే, ఆ సీరియల్ ఏళ్లు గడిచే కొద్ది నడుస్తుండటంతో ఆధరణ తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సీరియల్‌‌కు శుభం కార్డు పడింది. ఈ విషయాన్ని నవ్య.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా వెల్లడించింది. ‘‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ‘మీనాక్షి’ రేపటితో ముగుస్తుంది. ఈ సీరియల్ స్టోరీకి శుభం కార్డు పడుతుందేమో.. కానీ, మీనాక్షి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని పేర్కొంది. ఈ సీరియల్ ముగింపుతో నవ్య స్వామి డేట్లు దాదాపు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే.. నవ్య నటించిన ‘ఆమె కథ’, ‘కంటే కూతురినే కనాలి’ సీరియల్స్ కూడా ముగిశాయి. దీంతో నవ్యను ఇక బుల్లితెరపై చూడటం కష్టమే.


‘ఆమె కథ’ సీరియల్‌‌లో మహేశ్వరి పాత్రతో నవ్య ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కంటే కూతుర్నే కనాలి’ అనే సీరియల్‌లో కూడా ఆమెకు మంచి పాత్ర లభించింది. అయితే, ‘ఆమె కథ’ సీరియల్‌లో నటుడు రవికృష్ణతో కలిసి పనిచేసిన నవ్యతో అతడితో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక.. ఇద్దరూ పలు రియాలిటీ షోలతో కలిసే కనిపించేవారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వారు తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని తేల్చేశారు. కస్తూరీ సీరియల్ నటి ఐశ్వర్య పిసే నవ్యకు వదిన అవుతుంది. మరి, ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేవు కాబట్టి.. నవ్య పెళ్లి చేసుకుంటుందో లేదా.. త్వరలో రానున్న ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో ప్రత్యక్షం అవుతుందో చూడాలి. ఆమె ‘బిగ్ బాస్’ సీజన్-5లో కనిపిస్తుందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. మరి, ఈసారి అవకాశం వస్తుందో లేదో. 


Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..


Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి