Meenakshi Chaudhary Next Movie: టాలీవుడ్ లో ఇప్పుడున్న అప్ కమింగ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీస్ లో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి రొమాన్స్ చేస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ సరసన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో తెలుగు వెండితెరిపి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో తన గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఆ తర్వాత అడివి శేష్ తో కలిసి నటించిన 'హిట్ 2' మీనాక్షి కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో గ్లామర్ షో చేయడంతో పాటు లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. 'హిట్ 2'తర్వాత ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.


వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్


రీసెంట్ గా 'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మీనాక్షి చౌదరి సైతం వెంకటేష్ సినిమాలో నటిస్తుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో మీనాక్షి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందా? లేక సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.


ముచ్చటగా మూడోసారి


విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'ఎఫ్2' సినిమా వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించాడు. కమర్షియల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'ఎఫ్ 3' కూడా మంచి సక్సెస్ సాధించింది. 'ఎఫ్ 3' తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు 'ఎఫ్2' ఫ్రాంచైజీక్ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వేరే కథతో రాబోతోంది. అనిల్ రావిపూడి - వెంకటేష్ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారు.


క్రేజీ టైటిల్


అనిల్ రావిపూడి ఈసారి విక్టరీ వెంకటేష్ కోసం విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. సొంత ఊళ్ల యొక్క ప్రాముఖ్యతను తెలిపేలా ఈ సినిమా కథాంశం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఫ్రెండ్షిప్, హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. ఈ సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట మేకర్స్. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడితో ఇప్పటివరకు పనిచేసిన హీరోలు కొందరు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.


Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'కల్కి2898AD' ట్రైలర్ ఎప్పుడంటే?