Hansika Motwani: ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆపిల్ బ్యూటీ హన్సిక. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలోనూ సత్తా చాటింది. ప్రస్తుతం కంప్లీట్ గా కోలీవుడ్ కే పరిమితం అయ్యింది.


పెళ్లి తర్వాత మరిన్ని ఆఫర్లు


రీసెంట్ గా తన ప్రియుడు సోహెల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. హీరోయిన్లకు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడం చూస్తాం. కానీ, ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.  ప్రస్తుతం  అర డజన్ కు పైగా సినిమాలు చేస్తోంది. అందాల ఆరబోత విషయంలోనూ ఏమాత్రం పరిమితులు పెట్టుకోలేదు. పెళ్లికి ముందుతో పోల్చితే ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.


జోరుగా ‘మై నేమ్‌ ఈజ్ శృతి’ ప్రమోషన్స్


ప్రస్తుతం హన్సిక ‘మై నేమ్‌ ఈజ్ శృతి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ నవంబర్  17నన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హన్సిక హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సినిమాతో పాటు పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.


Read Also: మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం


వివాహ జీవింత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు


పెళ్లికి ముందుకు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్లు చెప్పింది హన్సిక. “నాకు పెళ్లి అయిన తర్వాత పెద్దగా మార్పులు ఏవీ రాలేదు. షూటింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే నేను నటిగా ఫీలవుతాను. ఆ తర్వాత మామూలుగానే ఉంటాను. ఇంటి దగ్గర మరింత కామన్ గా కనిపిస్తాను. సాయంత్రం ఆరు తర్వాత కేవలం ఫ్యామిలీకే సమయం కేటాయిస్తాను. సినిమాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు. నా భర్తతో ఎక్కువగా సమయం గడిపేందుకు ఇష్టపడతాను. నా వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. ఇక ముందు కూడా ఇలాగే హ్యాపీగా ఉంటుందని భావిస్తున్నాను. చాలా మంది పెళ్లైన హీరోయిన్లు కెరీర్ ను సరిగా ఫ్లాన్ చేసుకోలేకపోతున్నారు. అందుకే, వారి సంసార జీవితం సమస్యల్లో చిక్కుకుంటుంది. కానీ, నేను అలా కాదు. సినిమాలతో పాటు వైవాహిక జీవితానికి సమానంగా టైం కేటాయిస్తుస్తున్నాను. అందుకే, అటు సినిమా లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ సంతోషంగా ముందుకు నడుస్తోంది” అని వెల్లడించింది.  


‘మై నేమ్ ఈజ్ శృతి’ స‌స్పెన్స్ ఎంక్వైరీ థ్రిల్ల‌ర్‌ గా రూపొందింది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.  ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా,  వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు.  మురళీశర్మ, ఆడుకలం నారాయణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని న‌వంబ‌ర్ 17న‌  విడుదల చేయనున్నారు.