కోలీవుడ్ స్టార్ హీరో శింబు అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన 'మానాడు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శింబు.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వెందు తనిందదు కాడు' సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు శింబు. 


షూటింగ్ లో కొన్ని వారాలుగా బిజీగా ఉన్న శింబుకి నిన్నటి నుంచి జ్వరంతో పాటు గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ అని బాగా తిరిగారు కాబట్టి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించినట్లు తెలుస్తోంది. కానీ అందులో నెగెటివ్ అని తేలింది. శింబుకి వచ్చింది మామూలు ఇన్ఫెక్షన్ అని.. కోవిడ్ కాదని తెలుస్తోంది. 


శింబు హాస్పిటల్ లో చేరాడనే విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తమిళంతో పాటు శింబు తెలుగులో కూడా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన 'మన్మథ', 'వల్లభ' లాంటి సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి.