తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఈ మేరకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన ఇలా చెప్పుకొచ్చారు.. ‘తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయ్యి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తద్వారా బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. రామ్ చరణ్ ట్వీట్ చూసి ఆయన అభిమానులు ఆయకు కూడా విసెష్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.


కేటీఆర్ తో మంచి సంబంధాలు..


రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మంచి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలసి ఒకే వేదికపై పలు సందర్భాల్లో కనిపించారు కూడా. గతంలో రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ లకు కేటీఆర్ హాజరు కావడం, కేటీఆర్ ఆహ్వానం మేరకు రామ్ చరణ్ కూడా పలు కార్యక్రమాలకు హాజరవడం జరుగుతూ ఉంది. మొన్నామధ్య హైదరాబాద్ లో జరిగిన ఈ-రేసింగ్ కు కూడా రామ్ చరణ్, కేటీఆర్ కలసి ఓ కార్యక్రమంలో కనిపించారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ పోస్ట్ లు చేసుకోవడం కూడా చూశాము. ఇలా రామ్ చరణ్ కు తెలంగాణతో ప్రజలతోనే కాకుండా అక్కడి రాజకీయ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 


సినిమాల్లో ఫుల్ బిజీగా..


రామ్ చరణ్ ప్రస్తుం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు చరణ్. ఈ మూవీ తర్వాత హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ కు ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనుంది ఈ సినిమా. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తో మరో సినిమా చేయనున్నారు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చేశాయి. దీని తర్వాత మరో భారీ ప్రాజెక్టులో చరణ్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటితో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నిజానికి ‘కార్తికేయ 2’ కంటే ముందే రామ్ చరణ్ చందూ మొండేటితో ఓ సినిమా చేయాలని చర్చించుకున్నారట. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని తెలుస్తోంది. వీటితో పాటు త్వరలోనే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.