ఏరువాక పౌర్ణమి.. ప్రతీ రైతు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. వేసవికాలం తర్వాత పల్లేల్లో ప్రజలు వ్యవసాయం ప్రారంభానికి ముందు సూచికగా ఈ పండగను జరుపుకుంటారు రైతులు. పొలాల్లో పంటలు బాగా పండాలని కోరుతూ సంబరాలు జరుపుకుంటారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రైతన్నలు పొలం పనుల్లో తమకు చేదోడువాదోడుగా నిలిచే ఎడ్లకు రంగులద్ది, అలంకరించి వాటికి పూజలు చేస్తారు. పంటలు బాగా పండాలని మొక్కుతారు. అయితే ఈ ఏడాది ఏరువాక పౌర్ణమి పండగను వినూత్నంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా గిడికల్ ప్రాంత వాసులు. ఏరువాక పండుగలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వినూత్న ప్రయత్నం చేశారు. తమ అభిమాన నటుడి వేషధారణలో వస్త్రాలు ధరించి ఊరేగింపుగా సందడి చేశారు.


రామ్ చరణ్ గెటప్ లో ఏరువాక పౌర్ణమి సంబరాలు..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా  అభిమానుల్ని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది కూడా. అందులో రామ్ చరణ్ తెల్లటి దస్తుల్లో సైకిల్ తొక్కుతూ వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గెటప్ నే కాపీ చేశారు గుడికల్ యూత్. ప్రతీ ఏటా ఏరువాక పౌర్ణమికి తమ ఊర్లో రామ్ చరణ్ అభిమానులంతా కలసి ఆయన సినిమాలో గెటప్ ను వేసుకొని ఊరేగింపుగా ప్రదర్శన చేస్తారట. అందులో భాగంగానే రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఆధ్యర్యంలో ఈ ఏడాది కూడా రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ చేంజర్’ లోని రామ్ చరణ్ గెటప్ ను అందరూ  అచ్చుగుద్దినట్టు దించేశారు. అంతే కాదు అంతా కలసి సైకిల్ పై ఊరేగింపుగా వెళ్లారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 






వరుస సినిమాలతో బిజీగా రామ్ చరణ్..


రామ్ చరణ్ ప్రస్తుం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన చరణ్ ఈ మూవీ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తో మరో సినిమా చేయనున్నారు. తర్వాత ‘కార్తికేయ 2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటితో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. వీటితో పాటు త్వరలోనే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. 


Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!