ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడం వేరు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం వేరని చెప్పాలి. ఈ మధ్యకాలంలో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించిన సినిమా ఏదైనా ఉందంటే 'పుష్ప' అనే చెప్పాలి. ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందంట.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ.. బన్నీ మేనరిజమ్స్ ను ఫాలో అయిపోతున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా 'పుష్ప'కి భారీ క్రేజ్ వస్తోంది. 

 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో 'తగ్గేదేలే', 'శ్రీవల్లి' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 'శ్రీవల్లి' పాటలో బన్నీ వేసిన స్టెప్ ఓ రేంజ్ లో జనాల్లోకి వెళ్లింది. చెప్పు జారిపోతే తిరిగి తొడుక్కుంటూ బన్నీ వేసే స్టెప్ ను అందరూ అనుకరిస్తున్నరు. ఇప్పటివరకు సెలబ్రిటీలు, క్రికెటర్స్, ఫ్యాన్స్.. ఈ స్టెప్ ను అనుకరిస్తే.. ఇప్పుడు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా 'శ్రీవల్లి' స్టెప్పును వేస్తూ 'తగ్గేదేలే' అనే డైలాగ్ చెప్పడం హైలైట్ అవుతోంది. 

 

సీనియర్ నటుడు జగపతి బాబు దుబాయ్ లో ఓ షోకి హాజరయ్యారు. అందులో పాండా బొమ్మ 'పుష్ప'లో పాటకి స్టెప్స్ వేయగా అక్కడే ఉన్న జగపతిబాబు.. 'బన్నీ, సుక్కు చేసిన పని.. పాండా కూడా డాన్స్ చేస్తోంది.. దాంతో కలిసి నేను కూడా స్టెప్ వేశాను.. ఈ సినిమా ఇంతగా జనంలోకి తీసుకెళ్లిన 'పుష్ప' టీమ్ కి హాట్సాఫ్' అంటూ చెప్పుకొచ్చారు. 

 

ప్రస్తుతం 'పుష్ప' 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.