Reasons for the ruling party victory in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ (బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ) 243 సీట్లలో 200కి పైగా స్థానాలు సాధించి చరిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీ 90, జేడీయూ 81, ఎల్‌జేపీ (రామ్ విలాస్) 21 సీట్లతో ముందుంది. మహాఘట్‌బంధన్  ఆర్‌జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్  కేవలం 30కి అటూ ఇటూగా సీట్లకు పరిమితమైంది. ఈ ఏకపక్ష ఫలితాలు ఎలా వచ్చాయి? అలయన్స్ బలోపేతం, విపక్షాల ఓట్ల  విభజన, అభివృద్ధి , మంచి పాలనకు ప్రజల మద్దతు కారణాలని చెబుతున్నారు. 

Continues below advertisement

కూటమి పార్టీల ఓట్ల బదిలీ - ఓటు షేర్‌లో 10 శాతం పైచేయి 

ఎన్‌డీఏ విజయానికి ప్రధాన కారణం అలయన్స్‌లోని పార్టీల మధ్య ఓటు కలయిక. 2020లో 37.2% ఓటు షేర్ ఉన్న ఎన్‌డీఏ ఇప్పుడు 47 శాతం కంటే ఎక్కువకు చేరింది. ఎల్‌జేపీ (రామ్ విలాస్) తిరిగి ఎన్‌డీఏలో చేరడం 5.5% ఓట్లు తీసుకొచ్చింది. బీజేపీ ఓటు షేర్ 1.5%, జేడీయూ 3% పెరిగాయి. 2020లో ఎల్‌జేపీ జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేసి విభజన చేసినప్పుడు జేడీయూ ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఆ ఓట్లు జేడీయూకు మారాయి. 

Continues below advertisement

చీలిపోయిన ప్రతిపక్ష  ఓటు విభజన 

మహాఘట్‌బంధన్ ఓటు షేర్ 2020లో 37.2% నుంచి 2025లో 37కు మాత్రమే పెరిగింది. కానీ ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) 3.5% ఓట్లు తీసుకుని మహాఘట్‌బంధన్ ఓట్లను 2.8% తగ్గించింది. ఏఐఎమ్‌ఐఎం కూడా ముస్లిం ఓట్లను విభజించింది.   ఈ విభజన ఎన్‌డీఏకు మెజారిటీ సీట్లు తెచ్చింది.  ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ పార్టీల్ (ఎన్‌ఓపీ) ఇండెక్స్ 2020లో 3.34 (త్రికోణ పోటీ) నుంచి 2025లో 2.65కు (బైపోలార్) తగ్గడం వల్ల ఎన్‌డీఏ ఓటు షేర్ సీట్లుగా మారిందని నిపుణులు చెబుతున్నారు.  "బైపోలార్ సిస్టమ్‌లో చిన్న ఓటు తేడా పెద్ద సీటు లాభాన్ని ఇస్తుంది" అని నిపుణులు  అంటున్నారు. 

పథకాలు, అభివృద్ధి ప్రచారం

ఎన్‌డీఏ ప్రచారంలో విద్యుత్, ఆరోగ్యం, నీటి సరఫరా వంటి పథకాలు కీలకం. మహిళలకు రూ.10,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీమ్ మహిళా ఓటర్లను ఆకర్షించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ "మహిళా ఓటు పెరగడం వల్ల ఎన్‌డీఏ గెలిచింది" అన్నారు.  నితీష్ కుమార్ పాపులారిటీ, మోదీ జాతీయ ఆకర్షణ కలిసి "సుశాసన్" (మంచి పాలన) ఇమేజ్‌ను బలపరిచాయి.  ఆర్‌జేడీకు "జంగుల్ రాజ్" ట్యాగ్ ఉంది.  లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో బీహార్ దారుణంగా ఉండేది.  ఆ ఇమేజ్ భారీ దెబ్బ తీసింది. తేజస్వి యాదవ్ రఘోపూర్‌లో  గెలవలేకపోవడం దీనికి సంకేతం.  రికార్డు స్థాయిలో ఓట్లు నమోదు కావడం కూడా ఎన్డీఏకు కలసి వచ్ింది. మొదటి దశ 65.08%, రెండో దశ 69.20% టర్నౌట్ 1951 తర్వాత అత్యధికం . ఎన్‌డీఏ "మోడల్ ఎలక్షన్"గా ప్రశంసించింది.

ఆర్జేడీ, కాంగ్రెస్‌కు కలసి రానికాలం   2020లో కేవలం 125 సీట్లతో మెజారిటీ మార్జిన్‌తో గెలిచిన ఎన్‌డీఏ ఇప్పుడు ఓటు షేర్‌ను 47.2%కు పెంచుకుని ఏకపక్ష డామినెన్స్ చూపింది.  ఆర్‌జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ 2020లో 110 సీట్లతో దగ్గర పోటీ చేసినా, 2025లో 30 సీట్ల దగ్గరే ఆగిపోయింది.  2020లో ఎన్‌డీఏ మెజారిటీ (122) మార్జిన్‌తో (3 సీట్లు) గెలిచింది, కానీ 2025లో 200+ సీట్లతో ల్యాండ్‌స్లైడ్ విజయం సాధించింది. మహాగథ్‌బంధన్ 2020లో దగ్గరగా ఉండి, 2025లో భారీ దెబ్బ తిన్నది. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) 2025లో 3-5% ఓట్లతో 0 సీట్లు సాధించి, ఓపోజిషన్ ఓట్లను విభజించింది.