TVK Party Candidate Win over one Vote: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదే అనే నిజాన్ని తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. శివగంగ జిల్లాలోని తిరుప్పత్తూరు నియోజకవర్గంలో జరిగిన పోరు భారత ఎన్నికల చరిత్రలోనే నిలిచిపోతుంది. డీఎంకే సీనియర్ నేత, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయనను, విజయ్ నేతృత్వంలోని Tamizhaga Vetri Kazhagam (TVK)-టీవీకే అభ్యర్థి శీనివాస
సేతుపతి ఒక్కఓటు తేడాతో ఓడించారు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం TVK అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టిన 15నెలల్లోనే ఇప్పుడు ఆ TVK ఇప్పుడు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ పార్టీ మొదటి స్థానంలో నిలవడం సంచలనం రేకేత్తించింది. అయితే ఇప్పుడు అదొక్కటే కాదు.. ఆ పార్టీ తరపున ఓ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలవడం మరో సంచలనం.
One Vote Majority MLA:
తమిళనాడు ఎన్నికల్లో TVK 108 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావలసిన మెజార్టీకి దూరమే. అయితే ఈ 108 స్థానాల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుచుకున్న తిరుప్పతూరు సీటు కూడా ఉంది. ఆయన DMK మంత్రి కేఆర్ పెరియ కరుప్పన్ను ఓడించారు. సేతుపతికి 83,375 ఓట్లు రాగా.. మంత్రికి 83,374 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒక్క ఓటు తేడాతోనే సేతుపతి గెలిచాడు. సహకార మంత్రి పెరియకురుప్పన్ ఈ నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 2006నుంచి ఆయనే అక్కడ ఎమ్మెల్యే. 20 ఏళ్లుగా పాతుకుపోయిన పెరియకురుప్పన్ను సేతుపతి ఒక్క ఓటుతో ఓడించారు. ఈ ఎన్నికల్లో విజయ్ అభ్యర్థిని గెలిపించడానికి తాను మస్కట్ నుంచి వచ్చానని విజయ్ అభిమాని మణికందన్ శివానందం సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. బహుశా తాను ఓటు వేయడం వల్లే తిరుపత్తూరులో TVK గెలిచిందని అతను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
స్పెషల్ అట్రాక్షన్ సేతుపతి
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరికీ సంపూర్ణ మెజార్టీ రాని తరుణంలో ఒక్క సీటు కూడా చాలా ముఖ్యమైందే. ఇప్పుడు ఒక్క ఓటుతో ఒక్క సీటును గెలవడం అంటే... కచ్చితంగా అది చాలా పెద్ద బోనస్.. అందుకే ఆ సీటును గెలుచుకున్న సేతుపతి ఇప్పుడు TVKలో చాలా స్పెషల్ అయిపోయారు. మంగళవారం TVK చీఫ్ విజయ్ ఎమ్మెల్యేలతో సమావేశం అయినప్పుడు కూడా సేతుపతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు విలువ ఎంత ముఖ్యమో తన ఎన్నిక చాటుతుందని సేతుపతి అన్నారు.
ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ తరుపున గెలిచిన వాళ్లంతా చాలా సామాన్యులే. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కాకుండా కామన్ పబ్లిక్కు విజయ్ టికెట్లు ఇచ్చారు. వాళ్లే ఇప్పుడు 30మందికి పైగా మంత్రులను ఓడించారు. ఎన్నికల సభల్లో విజయ్ తానే అభ్యర్థినని.. ప్రతీ నియోజకవర్గంలో కూడా తానే ఎమ్మెల్యే అనుకుని ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. అది బాగా కలిసొచ్చింది.
