Telangana Lok Sabha Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
Telangana Lok Sabha Election 2024 Voting Live Updates: తెలంగాణలో లోక్ సభ సమరానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
ABP DesamLast Updated: 13 May 2024 06:07 PM

Background
Telangana Lok Sabha Election 2024 Phase 4 polling Live: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం...More
Telangana Lok Sabha Election 2024 Phase 4 polling Live: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగనుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు.రాష్ట్రంలో 17 స్థానాల్లో మొత్తం 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ భద్రత కోసం 73 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఫోర్సెస్ తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 7 వేల మంది ఇతర రాష్టాల హోంగార్డులతోనూ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంటారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ఇదీ ముఖచిత్రంతెలంగాణలో మొత్తం ఓటర్లు - 3,32,32,318పురుష ఓటర్లు - 1,65,28,366మహిళా ఓటర్లు - 1,67,01,192ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది - 2,94,000భద్రతా విధుల్లో 160 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 73 వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులుమొత్తం బ్యాలెట్ యూనిట్స్ - 1,05,019బరిలో ప్రముఖులుతెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), కాంగ్రెస్ నేత దానం నాగేందర్ (సికింద్రాబాద్), ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్ కర్నూల్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) వంటి ప్రముఖులు బరిలో నిలిచారు.
తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు.