Telangana Election Results 2023 LIVE: ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Telangana Assembly Election Results 2023 LIVE Updates: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎల్పీ సమావేశం ముగియగా సీఎం ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

ABP Desam Last Updated: 05 Dec 2023 09:13 AM
ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కొసరత్తు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రతినిధులు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. తమ అభిప్రాయాలు మరింత గట్టిగా చెప్పేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ఖర్గేతో అంతా కలిసి సమావేశం కానున్నారు. సీఎం పేరును ఖరారు చేసి సాయంత్రానికి సీల్డ్ కవర్‌లో తీసుకురానున్నారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత సీఎం పేరు అందరి సమక్షంలో ప్రకటించనున్నారు. సీఎం పేరు ప్రకటన తర్వాత ఎల్లుండి ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ముగిసిన సీఎల్పీ భేటీ - సీఎం ఎంపికపై సస్పెన్స్

తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయంతో సీఎల్పీ నేత ఎంపిక కసరత్తు మొదలైంది. ఇందు కోసం కాంగ్రెస్ అగ్రనేతల సీఎల్పీ సమావేశం ముగిసింది. గంట పాటు సమావేశమైన నేతలు సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఈ క్రమంలో నేటి సాయంత్రానికి సీఎం ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు - ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.?

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 స్థానాల్లో 'కాంగ్రెస్' ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్లో విజయం సాధించారు.

ఈ ఓటమి 'కారు'కు స్పీడ్ బ్రేకర్ మాత్రమే - కేటీఆర్

తెలంగాణ ఎన్నికల్లో ఈ ఓటమి కారుకు చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ కేసీఆర్ రాజీనామా చేశారని, ఎంతో కష్టపడినా ఆశించిన ఫలితం రాలేదని చెప్పారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని, ఈ పరాజయానికి కారణాలను విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర్ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని అన్నారు.

KTR Comments: కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టం - కేటీఆర్

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టం. వాళ్లు కుదురుకోవాలి. పని చేయాలి. ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. గతంలో పని చేసిన దాని కంటే రెట్టింపు కష్టం చేస్తాం. ఎవరూ నిరాశకు గురి కావొద్దు. పదేళ్లుగా అధికారం అప్పగిస్తే సమర్థంగా నడిపాం. మేం చేసిన పని పట్ల సంతృప్తి ఉంది. ఓడిపోయామన్న బాధ, అసంతృప్తి లేదు.' అని కేటీఆర్ తెలిపారు.

KTR Comments: ఓటమికి కారణాలు సమీక్షించుకుంటాం - కేటీఆర్

ఈ ఎన్నికల్లో తమ ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 119 సీట్లకు గాను 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని తెలంగాణ ప్రజలు ఆదేశించారని, ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

Vijayashanthi Tweet: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు - విజయశాంతి ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. ఇది ధర్మ విజయమని, తెలంగాణకు వచ్చిన మంచి రోజులు ఇవి అని ట్వీట్ చేశారు.

CM KCR Won: గజ్వేల్ లో సీఎం కేసీఆర్ గెలుపు

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ విజయం సాధించారు. అయితే, గతం కంటే ఆయనకు మెజార్టీ తగ్గింది. కామారెడ్డిలోనూ పోటీ చేసిన ఆయన అక్కడ రెండో స్థానానికే పరిమితమయ్యారు.

Congress Won: 65 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 35 స్థానాల్లో విజయం సాధించగా, ఇంకా 3 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఎంఐఎం 6 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.

డీజీపీపై ఈసీ వేటు - ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయన్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీజీపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు నోటీసులు జారీ చేసింది.

కరీంనగర్ లో 326 ఓట్ల తేడాతో గంగుల విజయం

కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. గంగుల 326 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో బండి సంజయ్ రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

DGP Sudpended: డీజీపీ అంజనీ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు - పీటీఐ వర్గాలు

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిని కలవడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Counting Stopped: జూబ్లీహిల్స్ లో నిలిచిన కౌంటింగ్

జూబ్లీహిల్స్ లో కౌంటింగ్ నిలిచిపోయింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరాలతో అధికారులు కౌంటింగ్ నిలిపేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

New cm: రేపే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.?

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. 'గవర్నర్ ను కలిసి చర్చిస్తాం. రేపు ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించి సాయంత్రం ప్రమాణ స్వీకారం జరిపేందుకు సిద్ధమవుతున్నాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Eelctions Results Live Updates 2023: గెలుపొందిన ఎమ్మెల్యేలకు 2+2 భద్రత

తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. 2+2 గన్ మెన్ లను కేటాయించాలని సూచించారు. ఈ మేరకు సీపీతో సమీక్ష జరిపారు.

Bandi Sanjay Lost: కరీంనగర్ లో బండి సంజయ్ ఓటమి

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ మెజార్టీతో విజయం సాధించారు.

మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటివరకూ 61 స్థానాల్లో విజయం సాధించి మేజిక్ ఫిగర్ ను దాటేసింది. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 31 స్థానాల్లో విజయం సాధించగా, ఆ పార్టీ అభ్యర్థులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  

సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా

సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసైకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎలాంటి కాన్వాయ్ లేకుండానే ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొమ్మిదేళ్లకు పైగా సీఎంగా సేవలందించారు.

కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై డీజీపీతో చర్చ

తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంలో సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీతో చర్చించారు. నేతల ప్రమాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. 

తెలంగాణలో 'కాంగ్రెస్' విజయం - హరీష్ రావు శుభాకాంక్షలు

తెలంగాణలో 'కాంగ్రెస్' విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేత హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం - సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యం, శిరసావహిస్తున్నాం అని మహేశ్వరంలో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ హవా

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ సత్తా చాటింది. 29 స్థానాలకు గాను 17 చోట్ల బీఆర్ఎస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవ లేకపోయింది. పాతబస్తీలో ఎంఐఎం పట్టు నిలుపుకొంది. బీజేపీ ఒకే స్థానానికి పరిమితమైంది.

ఇద్దరు సీఎం అభ్యర్థులకు షాక్ - కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి గెలుపు

కామారెడ్డిలో ఇద్దరు సీఎం అభ్యర్థులకు షాక్ తగిలింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గెలుపొందారు. 6 వేల ఓట్ల తేడాతో గెలుపొంది ఆయన చరిత్ర సృష్టించారు.

కాసేపట్లో రాజ్ భవన్ కు కేసీఆర్ - గవర్నర్ కు రాజీనామా సమర్పణ

సీఎం కేసీఆర్ కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కేసీఆర్ గవర్నర్ కు తన రాజీనామా సమర్పించనున్నారు.

ప్రగతి భవన్ పేరు మారుస్తాం - రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రగతి భవన్ పేరు మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డా.బీఆర్.అంబేడ్కర్  ప్రజాభవన్ గా పేరు మారుస్తామని, ప్రజలందరికీ ప్రజా భవన్ లో ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సామాన్యుల కోసం సచివాలయ గేట్లు తెరిచి ఉంచుతామని చెప్పారు. 

ప్రజాస్వామ్య పునరుద్ధరణకే కాంగ్రెస్ కు అధికారం - టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని చెప్పారు. 'ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది. జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం. పౌరుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నాయకులందరి సహకారంతో హస్తం పార్టీ విజయం సాధించిందని అన్నారు.

పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు

హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గెలుపొందారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి  సత్యనారాయణరావు, తాండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి, దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ విజయం సాధించారు.

తెలంగాణలో 'కాంగ్రెస్' గెలుపు - టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందన

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 48 స్థానాల్లో విజయం సాధించగా, 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాలపై హస్తం నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎగురేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా చివరి ఊపిరి వరకూ కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా హస్తం జెండాను మోసిన ప్రతి కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఓ మోడల్ గా నిలబెడతా.' అంటూ ట్విట్ చేశారు.

చేవెళ్లలో బీఆర్ఎస్ విజయం - రీకౌంటింగ్ కు కాంగ్రెస్ డిమాండ్

చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపొందారు.  స్వల్ప మెజార్టీతో ఆయన గెలుపొందగా రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ డిమాండ్ చేశారు.

అప్పుడు అలా - ఇప్పుడు ఇలా, పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే

2018లో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో 8 మంది విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కొల్లాపూర్, కల్వకుర్తి, నకిరేకల్, తుంగతుర్తి, ఖమ్మం, పాలేరు, పినపాక, ఇల్లందు, జగిత్యాల, ఖానాపూర్ అభ్యర్థులు గెలుపొందారు.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయం - ఎన్నికల ఫలితాలపై ట్వీట్

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ 29 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా, ఈ పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని అన్నారు. రెండుసార్లు విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తప్పులు సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. ఓటమిని ఓ పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని చెప్పారు. విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అబినందనలు తెలిపారు. వారికి శుభం జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయం - ఎన్నికల ఫలితాలపై

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా, ఈ పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని అన్నారు. రెండుసార్లు విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గెలుపు దిశగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అబినందనలు తెలిపారు.

ముథోల్ లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ గెలుపు

ముథోల్ లో బీజేపీ అభ్యర్థి రామారావు గెలుపొందారు. 

కొల్లాపూర్ లో బర్రెలక్క ఓటమి

కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (కర్నె శిరీష) ఓటమి పాలయ్యారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 'కారు' జోరు

రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుండగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 7 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కేవలం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ గెలుపు

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళపై 52,207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మంత్రి నిరంజన్ రెడ్డి ఓటమి

వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి టి.మేఘారెడ్డి విజయం సాధించారు.

Bodhan Election Result 2023: బోధన్‌లో కాంగ్రెస్ గెలుపు

బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఆమేర్‌పై గెలిచారు. బోధన్‌లో 2014, 18లో కారు పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి గత పదేళ్లుగా ఎమ్మెల్యే పదవికి దూరంగా ఉండి తాజాగా గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద విజయం సాధించారు. 85 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

కాంగ్రెస్ అభ్యర్థుల జోష్ - 19 స్థానాల్లో విజయం, 46 స్థానాల్లో ఆధిక్యం

తెలంగాణలో హస్తం హవా కొనసాగుతోంది. మొత్తం 46 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, ఇప్పటివరకూ 19 స్థానాల్లో విజయం సాధించారు. 

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావు విజయం సాధించారు.

నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ విజయం

ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి శంకర్ విజయం సాధించారు. అటు నిజామాబాద్ అర్బన్ లోనూ బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణరావు విజయం సాధించారు.

మహేశ్వరంలో మంత్రి సబిత గెలుపు

మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. వరుసగా ఐదోసారి ఆమె విజయం సాధించారు. 

నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ గెలుపు

నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి విజయం సాధించారు. వర్దన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు విజయం సాధించారు. ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

ములుగులో సీతక్క విజయం

ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై గెలుపొందారు. 

గజ్వేల్ సీఎం కేసీఆర్ ఆధిక్యం - కామారెడ్డిలో షాక్

గచ్వేల్ లో 9వ రౌండ్ ముగిసే సరికి సీఎం కేసీఆర్ 14,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు కామారెడ్డిలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 14వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి 2,100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. 

సాగర్ లో జానారెడ్డి కొడుకు గెలుపు

నాగార్జున సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి గెలుపొందారు.

కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద విజయం సాధించారు. 85 వేల మెజార్టీతో ఆయన ప్రత్యర్థిపై గెలుపొందారు.

సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు.

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపు

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.

చెన్నూర్ లో బాల్క సుమన్ కు షాక్

చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు షాక్ తగిలింది. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి 37 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కామారెడ్డిలో పోటాపోటీ - 3,335 ఓట్ల ఆధిక్యంలో రేవంత్

కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. 11 రౌండ్లు ముగిసే సరికి రేవంత్ రెడ్డి 3,335 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్ లో రేవంత్ రెడ్డికి 260 ఓట్ల మెజార్టీ వచ్చింది. బీజేపీ ఓట్లు సైతం పెరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య 2 శాతం ఓట్ల తేడా ఉంది. సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.

మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

మెదక్ లో  కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై గెలుపొందారు.

సనత్ నగర్ లో మంత్రి తలసాని విజయం

సనత్ నగర్ లో మంత్రి తలసాని విజయం సాధించారు. అటు మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి ఘన విజయం సాధించారు.

మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం

మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. 

కల్వకుర్తిలో కాంగ్రెస్ గెలుపు

కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి గెలుపొందారు. 5 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బాన్సువాడలో స్పీకర్ పోచారం గెలుపు

బాన్సువాడలో పోచారం శ్రీనివాస రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. నల్గొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 54 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు.

సిరిసిల్లలో కేటీఆర్ 25 వేల ఓట్ల ఆధిక్యం

సిరిసిల్లలో కేటీఆర్ 25 వేల ఆధిక్యంలో ఉన్నారు. హుజూరాబాద్ లో 10 వేల ఓట్ల మెజార్టీలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.

జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండేపై గెలుపొందారు.

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి యశశ్విని రెడ్డి విజయం సాధించారు.

బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం

బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 3,900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజయం సాధించారు. ఆయన 46 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి విజయం సాధించారు. అటు నారాయణ్ ఖేడ్ లోనూ హస్తం అభ్యర్థి గెలుపొందారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డి - నల్గొండలో కోమటిరెడ్డి విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. వికారాబాద్ కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి

నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

బీజేపీకి బిగ్ షాక్ - రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అటు అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పై గెలుపొందారు. 

4 స్థానాల్లో కాంగ్రెస్ విజయం - బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించింది. బెల్లంపల్లి (గడ్డం వినోద్), అశ్వారావుపేట (ఆదినారాయణ), రామగుండం (రాజ్ ఠాకూర్), ఇల్లెందు (కోరం కనకయ్య) ల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు, భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 4280 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంబర్ పేటలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గెలుపొందారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరోవైపు, ఛార్మినార్ లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.  


 

ఈటలకు బిగ్ షాక్ - 2 స్థానాల్లోనూ ఓటమి దిశగా

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు షాక్ తగిలింది. ఆయన పోటీ చేసిన గజ్వేల్, హుజూరాబాద్ ల్లో ఓటమి దిశగా ఉన్నారు.

బెల్లంపల్లిలోనూ కాంగ్రెస్ విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బెల్లంపల్లిలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. హస్తం పార్టీ అభ్యర్థి  గడ్డం వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నపై విజయం సాధించారు. ఇప్పటివరకూ 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 65 స్థానాల్లో హస్తం అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. 

గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు. అటు, డీకే శివకుమార్ సైతం గాంధీ భవన్ కు చేరుకున్నారు.

బీఆర్ఎస్ తొలి విజయం - అంబర్ పేటలోనూ గెలుపు

భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 4280 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు, అంబర్ పేటలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికీ 3 చోట్ల విజయం సాధించగా, ఎంఐఎం ఓ చోట గెలుపొందింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడ్ లో ఉంది.

సీఎం అభ్యర్థిపై కలిసి నిర్ణయం తీసుకుంటాం - కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ విజయాన్ని సోనియా గాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తామని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ కాబట్టే డీజీపీ రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పారు. తాను సీఎం రేసులో ఉన్నానా.? లేదా.? అనేది అప్రస్తుతమని వ్యాఖ్యానించారు.

ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆధిక్యత

ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క 14వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 22,379 మెజార్టీతో ఉన్నారు.

తెలంగాణలో జనసేనకు షాక్ - డిపాజిట్లు రాని స్థితిలో అభ్యర్థులు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా కనిపించలేదు. కూకట్పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేటల్లో ఆ పార్టీ  ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు రాని స్థితిలో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయన వెంట పలువురు ఐపీఎస్ లు కూడా ఉన్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హస్తం దూకుడుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. 

గోషామహల్ లో రాజాసింగ్ ఆధిక్యం

గోషామహల్ లో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి, తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డి  ముందంజలో ఉన్నారు.

3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం - ఇప్పటివరకూ ఎన్ని స్థానాల్లో లీడ్ అంటే.?

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మూడో విజయం సాధించింది. రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. ఇప్పటికే అశ్వారావుపేట (ఆదినారాయణ), ఇల్లెందు(కోరం కనకయ్య) ల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అటు ఛార్మినార్ లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు. కాగా, ఇప్పటివరకూ 65 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

ఛార్మినార్ లో ఎంఐఎం విజయం

ఛార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై ఆయన గెలుపొందారు.

కాంగ్రెస్ ఖాతాలో తొలి 2 విజయాలు - ప్రస్తుతం లీడ్ ఎంతంటే.?

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. ఖమ్మం అశ్వారావుపేటలో హస్తం అభ్యర్థి ఆదినారాయణ బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, తన సమీప ప్రత్యర్థి అయిన, బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు.

హైదరాబాద్ లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ఎంఐఎం 4 చోట్ల, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక చోట ముందంజలో ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిలు అరికెపూడి గాంధీ (శేర్లింగంపల్లి), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), తలసాని శ్రీనివాస్ (సనత్ నగర్), కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), ముఠాగోపాల్ (ముషీరాబాద్), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), లాస్య నందిత (కంటోన్మెంట్), పద్మారావు (సికింద్రాబాద్), లక్ష్మారెడ్డి (ఉప్పల్), నందకిశోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి) ఆధిక్యంలో ఉన్నారు.

ఇప్పటివరకూ 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే అశ్వారావుపేట, ఇల్లందుల్లో హస్తం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అశ్వారావుపేట ఆదినారాయణ, ఇల్లందులో కోరం కనకయ్య గెలుపొందారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి.

సిర్పూర్ లో బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ముందంజ

సిర్పూర్ లో బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ముందంజలో ఉన్నారు. అటు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో కొనసాగుతున్నారు.

కొడంగల్ లో కాంగ్రెస్ ఆధిక్యం - అశ్వారావుపేట, ఇల్లందుల్లో కాంగ్రెస్ విజయం

కొడంగల్ లో 11వ రౌండ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు 17 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. అటు అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,358 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కనకయ్య విజయం సాధించారు. 

తెలంగాణ ఎన్నికల్లో కనపడని జనసేన ప్రభావం

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా కనిపించలేదు. కూకట్పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేటల్లో ఆ పార్టీ  ప్రభావం చూపలేకపోయింది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ హవా

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అశ్వారావు పేటలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖరారు కాగా, ఇల్లందులోనూ హస్తం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆయన 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 

ఆ మంత్రులు వెనుకంజ - వీరిది హవా

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్, నిర్మల్ అభ్యర్థి  ఇంద్రకరణ్ రెడ్డిలు వెనుకంజలో ఉన్నారు. జగదీశ్ రెడ్డి (సూర్యాపేట), మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) ముందంజలో ఉన్నారు.

3 రౌండ్లు పూర్తి - బర్రెలక్కకు 983 ఓట్లు

కొల్లాపూర్ లో బాగా వినిపించిన పేరు కర్నె శిరీష (బర్రెలక్క)కు మొదటి 3 రౌండ్లు పూర్తయ్యే సరికి 983 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 14,200 ఓట్లతో ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు.

ఖైరతాబాద్ లో బీజేపీ అభ్యర్థి ముందంజ

ఖైరతాబాద్ లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి లీడ్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ పై 771 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గోషామహల్ లో లీడ్ లోకి రాజాసింగ్

గోషామహల్ లో 7వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 5,120 ఓట్లతో లీడ్ లోకి వచ్చారు.

Telangana Election Counting News Live: అవసరమైతే గెలిచిన వారిని తరలిస్తాం - హైదరాబాద్‌లో కర్ణాటక మంత్రి

‘‘కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ ఇక్కడ చేసిందేమీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారు’’ అని కర్ణాటక మంత్రి రహీమ్ ఖాన్ తాజ్ క్రిష్ణా హోటల్ వద్ద తెలిపారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైన పరిస్థితుల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు అవసరమైతే ఎమ్మెల్యేలను తరలించడానికి కూడా తాము రెడీగా ఉన్నామని వివరించారు.

వీరికి 10 వేల ఓట్ల ఆధిక్యం

మధిరలో ఐదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క 10,499 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆర్మూర్ లో ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి 10,321 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అశ్వారావుపేటలో ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 13,876 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రామగుండంలో 9వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 29,641 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Telangana Congress Politics: కాంగ్రెస్ పక్కా ప్లానింగ్! తాజ్ కృష్ణా వద్ద రెడీగా బస్సులు - రంగంలోకి కాంగ్రెస్ మంత్రులు

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సిద్ధంగా ఉంది. ముందస్తు జాగ్రత్తగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను వెంటనే తరలించేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. అందుకోసం డీకే శివ కుమార్ హైదరాబాద్ లో ఉండి.. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ కు కాస్త అటుఇటుగా సీట్లు గెలిచిన పక్షంలో  గెలిచిన అభ్యర్థులను వెంటనే హోటల్ కు తరలించాలని ప్లాన్ చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇక్కడ గెలిచిన వారిని అటాచ్ చేసినట్లు తెలిసింది. ఇంకా చదవండి

11 వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి హవా కొనసాగిస్తున్నారు.

బర్రెలక్కకు షాక్ - రెండో రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయంటే.?

కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 9,797 ఓట్లతొ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క (కర్నెశిరీష)కు తొలి రౌండ్ లో 473 ఓట్లు రాగా, రెండో రౌండ్లో 262 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 735 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఈసీ ట్రెండ్స్ - ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ, ఫుల్ జోష్ లో హస్తం శ్రేణులు

ఈసీ తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 31, బీజేపీ 6, సీపీఐ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హస్తం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

బండి సంజయ్ పై గంగుల ఆధిక్యం

నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 2,232 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. షాద్ నగర్ లో 4 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య 2,586 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 3,873 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ పార్టీ ట్వీట్

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా ఆ పార్టీ ప్రత్యేక ట్వీట్ చేసింది. దొరల తెలంగాణ నుంచి విముక్తిని కోరుకున్న తెలంగాణ ప్రజలు అంటూ ట్విట్టర్ లో తెలిపింది.





ఖమ్మం జిల్లాలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

మొదటి నుంచి అనుకుంటున్నట్టు ఖమ్మంలో కాంగ్రెస్‌కు తిరుగు లేదు. ఎక్కడా బీఆర్‌ఎస్‌ ప్రస్తావన లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 10 స్థానాల్లో పోటీ జరిగితే 9 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ టికెట్ దక్కని జలగం వెంకటరావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేశారు. ఆయన అక్కడ విజయం దిశఘా పయనిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో కారుకు ఎదురుగాలి - పుంజుకున్న కాంగ్రెస్

కరీంనగర్‌ జిల్లాలో కూడా కారుకు ఎదురుగాలి తప్పడం లేదు. ఈ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండబోదని అంతా అనుకున్నారు కానీ... ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంది. 13 స్థానాల్లో పోటీ జరిగితే నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ దూసుకెళ్తోంది.

ఆదిలాబాద్ లో అనూహ్య ఫలితం - బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

ఆదిలాబాద్‌ లాంటి బాగా వెనుకబడిన జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ మాత్రం రెండంటే రెండు స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. ఓవరాల్‌గా 10 స్థానాలు ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ తలో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంటే... బీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

భాగ్యనగరం - బీఆర్ఎస్ కు అనుకూలం

హైదరాబాద్‌లో పరిస్థితి కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉంటే.. 8 స్థానాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ మిగతా పార్టీలు కూడా ఖాతాలు తెరుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక్కడ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులు నాలుగు స్థానాల్లో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపనట్టే కనిపిస్తోంది.

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హవా - మంత్రికి ఓటమి తప్పదా.?

వరంగల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ హవా కొనసాగింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించ లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ స్పీడ్‌ కనిపిస్తోంది. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే మూడు చోట్ల మాత్రమే కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ప్రభావం చూపుతున్నారు. మిగతా 9 చోట్ల చేయి తిరినట్టు కనిపిస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ హవా

రంగారెడ్డి జిల్లాలో ఫలితాలు చూస్తే బీఆర్‌ఎస్‌ జోరు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కారు దూసుకెళ్లింది. 14 స్థానాలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో మూడంటే మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చూపగలిగారు. మిగతా 11 స్థానాల్లో మాత్రం కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. చంద్రబాబు అరెస్టు లాంటి అంశాలతో ఇక్కడ కారుకు స్పీడ్‌ బ్రేకర్లు ఉంటాయని అంతా భావించారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కారు తన పట్టు నిలుపుకొనేట్టు కనిపిస్తోంది.

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ హవా

మెదక్‌ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అధికార పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. పది స్థానాలు ఉన్న మెదక్‌లో ఆరింటిలో కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు మినహా వేరే వాళ్లు ఈ మెదక్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు.

మహబూబ్ నగర్ జిల్లాలో హోరాహోరీ ఫైట్

మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం దిశగా పయణిస్తున్నారు. ఇలా మహబూబ్‌నగర్‌లో ఇరు పార్టీల మధ్య టైట్‌ ఫైట్ నడుస్తోంది.

ఈ స్థానాల్లో బీజేపీ లీడ్

తెలంగాణలో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిర్పూర్ కాగజ్ నగర్, నిర్మల్, ముథోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మహేశ్వరంలో ముందంజలో ఉన్నారు. వెనుకంజలో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ రాజాసింగ్ ఉన్నారు.

కామారెడ్డిలో కేసీఆర్ ఆధిక్యం - కేటీఆర్, హరీష్ రావు ముందంజ

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుతం 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్లలో 3,749 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు 3 రౌండ్లు పూర్తయ్యే సరికి 15,742 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు.

కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ ముందంజ

కుత్బుల్లాపూర్ లో 8వ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కే.పీ.వివేకానంద ఆధిక్యంలో ఉన్నారు. అటు షాద్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య 3 రౌండ్లు ముగిసే సమయానికి 1,783 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి 2585 ఓట్ల ఆధిక్యం

కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఆయన 2585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ లో కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన 8 వేల ఓట్లతో హవా కొనసాగిస్తున్నారు.

గోషా మహల్ లో ఆధిక్యంలో బీఆర్ఎస్

గోషా మహల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం - 7 రౌండ్లలోనూ ముందంజ

కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన 8 వేల ఓట్లతో హవా కొనసాగిస్తున్నారు.

ఈసీ వెబ్ సైట్ క్రాష్

4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫలితాల కోసం పెద్ద సంఖ్యలో ఈసీ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.

సిద్దిపేటలో మంత్రి హరీష్ కు 3,669 ఓట్ల ఆధిక్యం

సిద్దిపేటలో నాల్గో రౌండ్ లో మంత్రి హరీష్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన 3,669 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్స్ ముగిసే సరికి 19,441 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.


 

రేవంత్ రెడ్డి దూకుడు - ఆధిక్యంలో కేటీఆర్, మంత్రి సబిత వెనుకంజ

కొడంగల్ లో నాలుగో రౌండ్ లో రేవంత్ రెడ్డి 5,687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం ఆధిక్యంలో ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి 7,459 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థి 2,621 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అటు, మహేశ్వరంలో మంత్రి సబితా వెనుకబడగా, గోషామహల్ లో రాజాసింగ్ వెనుకంజలో ఉన్నారు.

ఈసీ ట్రెండ్స్ - కాంగ్రెస్ కు 47, బీఆర్ఎస్ 26, బీజేపీ 3

ప్రస్తుతం ఈసీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 26, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

కొల్లాపూర్ లో బర్రెలక్కకు షాక్

కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (కర్నె శిరీష)కు షాక్ తగిలింది. ఆమెకు కేవలం 474 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

బీఆర్ఎస్ కు షాక్ - వెనుకంజలో మంత్రులు

తొలి 3 రౌండ్లలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్, కొప్పుల, పువ్వాడ వెనుకంజలో ఉన్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇల్లందు, పాలేరు, సత్తుపల్లి, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో మూడో రౌండ్ లో హస్తం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ములుగులో సీతక్క ఆధిక్యం

ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 4 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్ నగర్ లో 15,700 ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ ఉన్నారు. తుంగతుర్తిలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 

3 రౌండ్ల ఫలితం - కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

3 రౌండ్లు ముగిసే సరికి కామారెడ్డి, కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. 

కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్ - గజ్వేల్ లో ఆధిక్యం

సీఎం కేసీఆర్ కామారెడ్డిలో మూడో స్థానంలో ఉన్నారు. గజ్వేల్ లో ఆయనకు వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యం వచ్చింది.

సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ - గోషామహల్ లో వెనుకబడ్డ రాజాసింగ్

సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఉప్పల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడ్డారు.

ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

ఈసీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12, బీజేపీ 1 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు అనూహ్య ఫలితాలు వచ్చాయి. వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొడంగల్ 3 రౌండ్లు పూర్తయ్యే సరికి 4,159 ఆధిక్యంలో ఉన్నారు.

కరీంనగర్ లో బండి సంజయ్ వెనుకంజ

కరీంనగర్ లో బండి సంజయ్ వెనుకంజలో ఉన్నారు. 1154 ఓట్ల మెజార్టీతో గంగుల కమలాకర్  ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

2 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్

తొలి 2 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. నల్గొండ జిల్లాలో అన్ని చోట్లా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ హవా కొనసాగుతోంది. అటు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది.

కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసే సరికి రేవంత్ కు 4,389 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అటు, కామారెడ్డిలోనూ రెండో రౌండ్ ముగిసే సరికి రేవంత్ 1962 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

రెండో రౌండ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

కామారెడ్డిలో రెండో రౌండ్ లోనూ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 1962 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. దుబ్బాకలో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాగా, తొలి రౌండ్ లో పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ప్రముఖులు వెనుకబడ్డారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం - కేటీఆర్ వెనుకంజ

సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలిరౌండ్ లో కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. 265  ఓట్లతో ఆయన వెనుకబడ్డారు. సిర్పూర్ లో బీజేపీ ముందంజలో ఉండగా, ఎంఐఎం 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం

ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ మెజార్టీ స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. స్టేషన్ ఘన్బూర్, నాగర్ కర్నూల్, తాండూరుల్లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. సత్తుపల్లి, మానుకొండూరు, నిజామాబాద్ రూరల్ లో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. అటు, ఛార్మినార్ లో బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ 2,539 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

తొలి రౌండ్ - బీజేపీ, కాంగ్రెస్ ఫలితం ఇలా

తొలి రౌండ్ లో మహేశ్వరం, నిర్మల్, కరీంనగర్ ల్లో బండి సంజయ్ లీడ్ లో ఉన్నారు. అటు ఆర్మూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఖైరతాబాద్ లో విజయారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో హస్తం పార్టీ ముందంజలో ఉంది.

ములుగు నియోజకవర్గంలో తొలి రౌండ్ లో కాంగ్రెస్ లీడ్

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం

పాలకుర్తి నియోజకవర్గం మొదటి రౌండులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి 738 ఓట్ల ఆధిక్యంలో ముందంజ


టోటల్ పోలైన్ ఓట్లు : 11262
కాంగ్రెస్ : 6000
బిఆర్ఎస్ : 5262
కాంగ్రెస్ లీడ్ :738

తొలి రౌండ్ - గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం

నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం, సనత్ నగర్ లో తలసాని, జుక్కల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజ, గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో ఉన్నారు. ముషీరాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.

తొలి రౌండ్ - చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అటు, కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Komatireddy Venkat Reddy: నల్గొండలో కోమటిరెడ్డి ఆధిక్యం

నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి 4 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు.

Elections Counting Live: తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. 


బీఆర్ఎస్ - 20


కాంగ్రెస్ - 42


బీజేపీ - 2

అశ్వారావుపేటలో మొదటి రౌండ్‌ పూర్తి- కాంగ్రెస్‌ ముందంజ

అశ్వారావుపేటలో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌కు నాలుగు వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 

Telangana Elections Live: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ జోరు

పోస్టల్ ఓట్ల లెక్కింపులో భాగంగా ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది.


బెల్లంపల్లిలో వినోద్‌ (కాంగ్రెస్‌)


నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్


ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)


కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)


మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌ (కాంగ్రెస్‌)


చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ (ఎంఐఎం)


కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి (బీజేపీ)


రామగుండం, ధర్మపురి, నిజామాబాద్ అర్బన్, రూరల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కామారెడ్డి, వేములవాడ, అశ్వారావుపేట, వికారాబాద్, పరిగి, మంథని, మునుగోడు తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉంది.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ముందంజ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. పాలేరు పొంగులేటి, ఖమ్మంలో తుమ్మలతోపాటు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. 

Telangana Election Results 2023 LIVE: హుజూరాబాద్‌లో ఈటల ముందంజ

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ముందంజలో ఉన్నారు. అక్కడ పాడి కౌశిక్‌ రెడ్డి వెనుకబడ్డారు. ఈటల రెండు స్థానాల్లో  పోటీ చేశారు. 

Kodngal Revanth Reddy News: కొడంగల్ పోస్టల్ బ్యాలెట్‌లో రేవంత్ రెడ్డి ముందంజ

కొడంగల్ కు చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 

Telangana Election Results 2023 LIVE: సిద్దిపేటలో హరీష్‌ ముందంజ

సిద్ధిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు లీడ్‌లో ఉన్నారు. 

Telangana Election Results 2023 LIVE: వరంగల్‌ ఈస్ట్‌లో కాంగ్రెస్‌ లీడింగ్

వరంగల్‌ ఈస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ లీడ్‌లో కొనసాగుతున్నారు. 

Telangana Election Postal Ballot: ఈ మూడు చోట్ల ఇంకా ప్రారంభం కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్

ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమై అర గంట అవుతున్నప్పటికీ ఇంకా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తికి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.

Telangana Election Results 2023 LIVE: ఖమ్మంలో తుమ్మల ముందంజ

ఖమ్మంలో జరిగిన పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. 

Bhatti Vikramarka: మధిర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భట్టి ముందంజ

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాగంగా మధిర స్థానం నుంచి భట్టి విక్రమార్క మల్లు ముందంజలో ఉన్నారు. ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ప్రారంభం కానుంది

Telangana Election Results 2023 LIVE: చాంద్రాయాన్‌ గుట్టలో అక్బరుద్దీన్ ముందంజ

హైదరాబాద్‌ పరిధిలోని చాంద్రాయాన్‌ గుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. 

Results Election Live Updates: కౌంటింగ్ కేంద్రాలకు చేరుతున్న అభ్యర్థులు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి మేడ్చల్ బీ.ఆర్.ఎస్ అభ్యర్ధి, మంత్రి చామకూర మల్లారెడ్డి చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కీసరలోని బోగారం హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి చేరుకున్నారు.

Telangana Election Results 2023 LIVE: నల్గొండలో కాంగ్రెస్‌ ముందంజ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. 

Bandi Sanjay: కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజ

కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందజలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇబ్రహీంపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇంకా మొదలు కాలేదు.

Telangana Election Counting Starts: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. దాదాపు 2.2 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దీనికి అరగంట సమయం పడుతుందని అంచనా. ఉదయం 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 

Telangana Election Commissioner Vikas Raj: ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ - వికాస్ రాజ్

మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతామని వివరించారు. ప్రతీ ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. లోపలా బయటా సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టింది. ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు.

Telangana Election Result Live: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ గా ఉండడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇబ్రహీం పట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్డీవో ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ లో మీడియాపై పోలీసుల ఓవరాక్షన్ చేశారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో ఉద్రిక్తత  నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపైకి కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హొలీకెరీ RDO కార్యాలయానికి చేరుకున్నారు.

Telangana Assembly Elections Live: ఈ నియోజకవర్గాల ఫలితం చాలా లేట్ అయ్యే అవకాశం

అన్ని నియోజకవర్గాల్లో కెల్లా రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఎల్బీ నగర్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల ఫలితాలు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పైగా లెక్కింపు రౌండ్లు కూడా అధికంగా ఉండడం వల్ల కౌంట్ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

Telngana Elections Result 2023 Live: ముందు ఫలితం వచ్చేది ఈ నియోజకవర్గమే..

మొత్తం 119 నియోజకవర్గాల్లో ముందు చార్మినార్ ఫలితం తేలనున్నట్లుగా అంచనా. నిజానికి భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్‌ నియోజకవర్గాల లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉన్నాయి. వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం నిజానికి అన్నిటికన్నా ముందు వస్తుంది. కానీ, చార్మినార్‌లో పోలైన ఓట్లు చాలా తక్కువగా ఉండడం వల్ల, ఈ ఫలితం భద్రాచలం, అశ్వారావు పేట కంటే ముందు తెలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Telangana Election Counting Live: 8 గంటలకు మొదలుకానున్న పోలింగ్

నేడు 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 49 సెంటర్లలో కౌంటింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 బూత్ లలో జరిగిన పోలింగ్ లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నమోదు చేశారు.

కౌంటింగ్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన ఎన్నికల అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానుంది. 10 సెగ్మెంట్లకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు చోట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి ముధోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు చోట్ల కూడా ఈవీఎం మెషిన్లను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పహార కాస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు చోట్ల ఈ 10 నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించనున్నారు. 

Background

Telangana Elections Results 2023: మరికొన్ని గంటల్లో ఉత్కంఠ వీడనుంది. తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో.? తేలిపోనుంది. 119 స్థానాలున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాల్లో గెలిచి తీరాల్సిందే. డిసెంబర్ 3న (ఆదివారం) మధ్యాహ్నానికి ఏ పార్టీకి అనుకూలంగా ఉందో స్పష్టత రానుంది. సాయంత్రానికి నైతిక విజయాల ఆక్రందనలు, గెలిచిన నేతల సంబురాలు, ఓడిన నేతలకు ఓదార్పులు, ఎందుకిలా జరిగింది.? రాజకీయ విశ్లేషణలు అన్నీ ఆవిష్కృతం కానున్నాయి. మరి ఓటర్లు ఎవరి మేనిఫెస్టోను ఎక్కువగా నమ్మారో.? ఎవరి చేతుల్లో తమ ఐదేళ్ల భవిష్యత్తును పెట్టారో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే. 


ఎవరికి వారే ధీమా


ఈ క్రమంలో గెలుపుపై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని సీఎం కేసీఆర్, ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించారు. ఇదే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని, కచ్చితంగా హ్యాట్రిక్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం పదేళ్ల కుటుంబ పాలనకు అంతం పలకాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలని, ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూస్తే అసలైన అభివృద్ధి అంటే చేసి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో అమలు చేసిన గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అటు, బీజేపీ సైతం బీసీని సీఎం చేస్తామనే ప్రధాన అజెండాతో ప్రజల్లోకి వెళ్లింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామంటూ చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తామనే నమ్మకంతో కమలం పార్టీ నేతలు ఉన్నారు. 


ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే.?


నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు పూర్తైన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు ప్రధాన సంస్థలు కాంగ్రెస్ దే అధికారం అంటూ తేల్చిచెప్పగా, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. తెలంగాణ ప్రజలు ఈసారి కచ్చితంగా అధికారం మార్పు కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపగా, ఇవి 'ఎగ్జిట్ పోల్స్' అని 'ఎగ్జాక్ట్ పోల్స్' కాదని బీఆర్ఎస్ నేతలు స్ఫష్టం చేస్తున్నారు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని, ఓ సంస్థ మాత్రమే సరైన ఫలితాలు వెల్లడించినట్లు చెప్పారు. ఈసారి కూడా మూడోసారి సీఎంగా కేసీఆర్ ఎన్నికై హ్యాట్రిక్ కొడతారని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు. 


హంగ్ వస్తే.?


తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లుండగా, సాధారణ మెజార్టీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కు ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది. ఆ పార్టీకి మజ్లిస్ ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్నందున 53 సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అయితే, మజ్లిస్ మద్దతిచ్చినా సరిపోనంతగా బీఆర్ఎస్ కు సీట్లు వస్తే ఆ పార్టీ జాతీయ పార్టీలో ఒకదానిని ఎంచుకునే ఛాయిస్ ఉంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ ల్లో ఎవరు బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకుంటే అతి పెద్ద సవాలేనని చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని స్థానాలు తగ్గితే, హస్తం పార్టీ ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు వెళ్తుందో.? అనేది ఆసక్తిగా మారింది. అసలు హంగ్ అనే పరిస్థితే వస్తే కాంగ్రెస్ పార్టీకే అసలు పరీక్షని చెప్పాలి. పదేళ్లుగా అధికారం దూరంగా ఉన్న పార్టీకి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని నేతలు భావిస్తున్నారు. పూర్తి మెజార్టీయే రావాలని ఆకాంక్షిస్తున్నారు.


కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి


మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 119 నియోజకవర్గాల్లో 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 3న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండనుంది. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌పై ఓ మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.