Election 2022 Voting Live Updates: సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్లో 63%, యూపీలో 57% ఓటింగ్
పంజాబ్ సహా ఉత్తర్ప్రదేశ్ మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
ABP Desam Last Updated: 20 Feb 2022 06:42 PM
Background
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు పంజాబ్కు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ లోనికి ఓటర్లను అనుమతిస్తారు. మొత్తం 117 స్థానాలకు ఈరోజే...More
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈరోజు పంజాబ్కు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్ లోనికి ఓటర్లను అనుమతిస్తారు. మొత్తం 117 స్థానాలకు ఈరోజే ఓటింగ్ జరుగుతోంది.ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.నేతల అభ్యర్థనపంజాబ్ ప్రజలు తమ అమూల్యమైన భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని దిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనతో పంజాబ్ ముందుకెళ్లేందుకు మీ ఓటు ఉపయోగపడుతుందని ప్రియాంక అన్నారు.భాజుపాకు గట్టి గుణపాఠం చెప్పేలా ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని బహుజన్సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు అందరూ తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
5 గంటల వరకు
సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్లో 63%, ఉత్తర్ప్రదేశ్లో 57 % పోలింగ్ నమోదైంది.