Election 2022 LIVE Updates: యూపీలో ప్రశాంతంగా పోలింగ్- సాయంత్రం 5 గంటల వరకు 57.45% ఓటింగ్
UP Election 2022: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ABP Desam Last Updated: 23 Feb 2022 06:29 PM
Background
UP Election 2022: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.లఖ్నవూ, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ, లఖింపుర్...More
UP Election 2022: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.లఖ్నవూ, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ, లఖింపుర్ ఖేరీ వంటి నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్ ఒకచోట గెలుపొందాయి. మాయావతిబీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లఖ్నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటేశారు.9 గంటల వరకుఉదయం తొమ్మిది గంటల వరకు 9.10 శాతం పోలింగ్ నమోదైంది.ఆంక్షల సడలింపుకరోనా వ్యాప్తి వేళ ప్రచారాలపై ఆంక్షలు విధించిన ఈసీ వాటిని క్రమంగా సడలిస్తోంది. సమావేశాలు, రోడ్షోలపై ఉన్న పరిమితులను సడలించింది. రాజకీయ పార్టీలు, నేతలు 50 శాతం సామర్థ్యంతో సమావేశాలు, ర్యాలీలు, రోడ్షోలను నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది.ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఉన్న ఇతర నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో జనవరి 8న పాదయాత్ర, రోడ్షోలు, ర్యాలీలు, సభలపై ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించిన ఈసీ ఆంక్షలను సడలించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
5 గంటల వరకు
యూపీ నాలుగో విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57.45% పోలింగ్ నమోదైంది.