ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణతోపాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ అంటే సోమవారం, అక్టోబర్ 8, 2023న ప్రకటించనుంది.


ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.


ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, సహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. వచ్చే జనరల్ ఎన్నికలకు దీన్ని సమీఫైనల్‌గా చూస్తున్నారంతా.