AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
Ap Assembly Elections 2024: రాష్ట్రంలో ఓట్ల పండుగకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ABP DesamLast Updated: 13 May 2024 09:29 PM
Background
Andhra Pradesh Assembly Election 2024 Polling Live Updates: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7...More
Andhra Pradesh Assembly Election 2024 Polling Live Updates: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ఎన్నికల సంఘం నిర్దేశించిన టైం లోపల క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. తొలుత మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఇదీ ముఖచిత్రంఏపీలో అసెంబ్లీ స్థానాలు - 175లోక్ సభ స్థానాలు - 25మొత్తం ఓటర్లు - 4.14 కోట్లు, పురుషులు - 2.3 కోట్లు, మహిళలు - 2.10 కోట్లుథర్ట్ జెండర్ ఓటర్లు - 3,421, సర్వీస్ ఓటర్లు - 68,185169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 1.6 లక్షల ఈవీఎంల వినియోగం.అటు, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, వేసవి దృష్ట్యా ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ల సౌకర్యం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది.పటిష్ట భద్రతపోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల సంఘం భద్రతకు వినియోగిస్తోంది. మొత్తం 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.ఈ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్రాష్ట్రవ్యాప్తంగా 30,111 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 12,459 కేంద్రాలను సెన్సిటివ్ గా ఈసీ గుర్తించింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాత వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అనంత, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని.. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఇక, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖలో 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.ఈ రూల్స్ పాటించాలిమాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చెయ్యొచ్చు.స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదు. ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు.పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ 3 వాహనాలకు అనుమతిస్తారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలుఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.ఈసారి ఓటింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు భారీగా తరలివస్తుండడంతో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది.