ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపీసీ స్ట్రీమ్ కింద బీటెక్, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు వాక్ ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌లోని వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 15న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

వివరాలు.. 

1) కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, కంది, సంగారెడ్డి జిల్లా 

2) కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా.

3) కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, సైఫాబాద్, హైదరాబాద్.

కోర్సులు- సీట్ల వివరాలు..

⦁ బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్): 41 సీట్లు (32 సీట్లు (ఫార్మర్/నాన్ ఫార్మర్) + 9 సెల్ప్ ఫైనాన్సింగ్  సీట్లు)

⦁ బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 53 సీట్లు (43 సీట్లు (ఫార్మర్/నాన్ ఫార్మర్) + 10 సెల్ప్ ఫైనాన్సింగ్  సీట్లు) 

⦁ బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్: 46 సీట్లు (41 సీట్లు (ఫార్మర్/నాన్ ఫార్మర్) + 5 సెల్ప్ ఫైనాన్సింగ్  సీట్లు)

అర్హత: ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంసెట్-2022 ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఎంసెట్ 2022 ర్యాంకు ఆధారంగా.

ఫీజు వివరాలు:

కౌన్సెలింగ్ తేదీ: 15.11.2022.

వేదిక:  University Auditorium, Rajendranagar, P.J.T.S.A.U., Hyderabad.

కౌన్సెలింగ్‌కు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే..
➽ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల ఒరిజినల్ మెమో 
➽ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్ కమ్ మార్కుల మెమో 
➽ తెలంగాణ ఎంసెట్ -2022 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు. 
➽ 6 - 12 తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్.
➽ టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్). 
➽ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. 
➽ ఈ మధ్యే తీసుకున్న కులధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే).
➽ EWS సర్టిఫికేట్ 
➽ నాన్ -మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి మాత్రమే) 
➽ అగ్రికల్చరల్ ల్యాండ్ సర్టిఫికేట్ (అవసరమైనవారికి మాత్రమే)

Notification 
Website 

::Also Read::

NEET PG: నీట్‌-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్‌' ఏంటంటే? 
వైద్యవిద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం రద్దుచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నీట్‌-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. నీట్-పీజీ స్థానంలో నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (NExT-నెక్ట్స్‌) నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్‌-పీజీ స్థానంలో నెక్ట్స్‌ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి నెక్ట్స్‌ 2023 డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. 2019-20 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు 'NExT' రాసే మొదటి బ్యాచ్‌ కానున్నారు. 'నెక్ట్స్' పరీక్ష తెరమీదకు వస్తుండటంతో వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో నిర్వహించనున్న 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG)' పరీక్ష చివరిది కావచ్చు. ఇకపై పీజీ మెడికల్ ప్రవేశాలకు ఎగ్జిట్ టెస్ట్ ఫలితాలపై ఆధారం కానున్నారు. డిసెంబర్ 2023లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్‌) నిర్వహించాలని భావిస్తున్నట్లు నవంబరు 7న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

UGC PhD Guidelines: విద్యార్థులకు గుడ్ న్యూస్, పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు - ఎలాగంటే?
ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. దీనిప్రకారం విద్యార్థులకు పీజీ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..