APTWREIS (Gurukulam) Admissions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ(ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.


వివరాలు..


* గిరిజన 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు 


విద్యా సంస్థ ప్రదేశాలు:


1) కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి


2) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం 


3) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట)


4) కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట


5) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి


6) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్


7) కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు


సీట్ల సంఖ్య: ఇంటర్ ఎంపీసీలో 300 సీట్లు; ఇంటర్ బైపీసీలో 300 సీట్లు; 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం ఏడో తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షకాదాయం రూ.లక్షకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.


పరీక్ష విధానం...


* ఎనిమిదో తరగతి ప్రవేశపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో తెలుగు-10 ప్రశ్నలు-10 మార్కులు, ఇంగ్లిష్‌-10 ప్రశ్నలు-10 మార్కులు, హిందీ-10 ప్రశ్నలు-10 మార్కులు, మ్యాథ్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌-15 ప్రశ్నలు-15 మార్కులు, బయోసైన్స్‌-15 ప్రశ్నలు-15 మార్కులు, సోషల్‌ స్టడీస్‌-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఏడో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.


* ఇంటర్‌ ప్రవేశపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, మ్యాథ్స్‌-40 ప్రశ్నలు-40 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, బయోసైన్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు  సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.03.2024.


➥ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 30.03.2024.


➥ ప్రవేశ పరీక్ష తేది: 07.04.2024.


➥ మెరిట్ జాబితా వెల్లడి: 05.05.2024.


➥ మొదటి దశ కౌన్సెలింగ్ తేది: 20.05.2024.


➥ రెండో దశ కౌన్సెలింగ్ తేది: 25.05.2024.


➥ తరగతులు ప్రారంభం: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.


Notification


Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..