తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్‌ 'ప్రత్యేక విడత'కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆగ‌స్టు 24న సీట్లు కేటయించారు. సీట్ల కేటాయింపు తర్వాత కన్వీనర్ కోటాలో 16,296 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 85,671 సీట్లకుగాను 69,375 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక విశ్వవిద్యాలయాల్లో 5,535లో 4,039 సీట్లు భర్తీకాగా 1496 సీట్లు మిగిలిపోయాయి.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అయిదు యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ కళాశాలల్లో 100 శాతం సీట్లు నిండగా, ఒక కళాశాలలో మాత్రం ఒక్కరూ చేరలేదు. ప్రత్యేక విడతలో 1966 మందికి కొత్తగా సీట్లు దక్కాయి. మరో 10,535 మంది చివరి విడతలో చేరిన కళాశాల, కోర్సు నుంచి మరో కళాశాల లేదా ఇతర కోర్సుకు మారారు. బీఫార్మసీలో 2,885 సీట్లకు 27 మాత్రమే (ఎంపీసీ విద్యార్థులు) నిండాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచిల్లో కన్వీనర్ కోటాలో 5,723 సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత కోర్సులో 4,959, సివిల్, మెకానికల్ సంబంధిత బ్రాంచిల్లో 5,156 సీట్లు ఖాళీగా ఉన్నాయి.


ఆగస్టు 26న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు..
ఆగ‌స్టు 26 నుంచి ఆగస్టు 28 మధ్య నిర్ణీత ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 27 నుంచి ఆగ‌స్టు 29 మధ్య సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 26 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


కౌన్సెలింగ్ వెబ్‌సైట్


ALSO READ:


ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటితోపాటు నిట్‌లు(NIT), ఐసర్లు(IISER), ఐఐఎస్సీ(IISC), ఐఐఈఎస్‌టీ(IIEST), డీఐఏటీ(DIAT), ఐఐపీఈ(IIPE), జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ (JNCASR), ఎస్‌ఎల్‌ఐఈటీ (SLIET) సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..