Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తులు సమర్పించారు. 


పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.


తెలంగాణ టెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


TS TET - 2024 పరీక్షల షెడ్యూల్ ఇలా..


➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 22: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 22:  పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)


➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)


➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 29:  పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)


➥ మే 29: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 2)


➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 2)


➥ జూన్ 1: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)


➥ జూన్ 1: పేప‌ర్-1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ 2)


➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 2)


అభ్యర్థులు మార్గదర్శకాలు..


➥టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. 


➥ నిర్ణయించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. 


➥ బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంటన్నర (90 నిమిషాల) ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 


➥ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్‌ను మూసివేస్తారు. అభ్యర్థులను ఉదయం విడతకు 8.45 గంటలకు, మధ్యాహ్నం విడతకు 1.45 గంటలకే గేట్‌ను అధికారులు మూసివేస్తారు.


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


➥ అభ్యర్థులు బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను తీసుకెళ్లాలి. 


➥కాలిక్యులేటర్లు, లాగరిథమ్‌ టేబుళ్లు, పేజర్‌, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరు.


➥ అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..